Don't Miss!
- News ముస్లీం రిజర్వేషన్లపై మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు, మేము వస్తే ఖేల్ కథం !
- Sports IPL 2024: రుతురాజ్ గైక్వాడ్పై అంబటి రాయుడు విమర్శలు.. తప్పుబట్టిన సిక్సర్ల సిద్దు!
- Lifestyle మండిపోయే ఎండలో చల్లగా దద్దోజనాన్ని ఇలా చేసుకోండి..?
- Automobiles మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
పబ్లో హీరో మంచు మనోజ్ వీరంగం, స్వల్ప విధ్వంసం...!
తెలుగు హీరో మంచు మనోజ్ గురించిన ఓ వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్లోని ఓ పబ్లో నిర్వాహకులతో మనోజ్ గొడవ పడ్డారని, ఈ క్రమంలో స్వల్ప విధ్వంసం చోటు చేసుకుందని సమాచారం. అయితే ఈ ఘటనపై పబ్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. దీంతో పోలీసులు ఈ ఘటనపై ఎలాంటి కేసు నమోదు చేయకుండా జనరల్ డైరీలో వివరాలు నమోదు చేసుకున్నారు.
గొడవ ఎందుకు జరిగింది?
మే 22న జూబ్లీహిల్స్ రోడ్ నంబరు 45లో ఉన్న ఫ్యాట్ పీజియన్ పబ్కు మనోజ్ వెళ్లారు. పబ్ క్లోజింగ్ సమయం కావడంతో రాత్రి 11.30 గంటలకు నిర్వాహకులు డీజే సౌండ్ తగ్గించారు. అయితే సౌండ్ పెంచాని మనోజ్ నిర్వాహకులతో గొడవ పడ్డాడని, ఈ క్రమంలో స్పీకర్లు ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది.
పోలీసులకు మనోజ్ వివరణ
ఈ గొడవ గురించి తెలుసుకున్న పోలీసులు వెంటనే పబ్ వద్దకు చేరుకున్నారు, అక్కడే ఉన్న మనోజ్ను ప్రశ్నించారు. తాను ఫేస్బుక్ లైవ్ ఆన్ చేశానని, సౌండ్ ఎక్కువగా ఉండడంతో తగ్గించమని మాత్రమే చెప్పానని మనోజ్ వారికి చెప్పినట్లు సమాచారం.
ఎవరూ ఫిర్యాదు చేయని వైనం
మనోజ్పై ఫిర్యాదు చేసేందుకు పబ్ నిర్వాహకులు ముందుకు రాలేదు. ఇతర వ్యక్తులు కూడా మనోజ్ మీద ఫిర్యాదు చేయక పోవడంతో జనరల్ డైరీ (జీడీ)లో ఈ ఘటన గురించిన వివరాలు నమోదు చేసినట్లు జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపారు.
వీడియో పుటేజ్ సేకరించిన పోలీసులు
గొడవ ఎందుకు జరిగింది? ఎలా జరిగింది అనే విషయాన్ని తెలుసుకునేందుకు పోలీసులు పబ్ లోని సీసీటీవీ పుటేజీని సేకరించారు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే తప్ప మనోజ్ మీద కేసు నమోదు అయ్యే అవకాశం లేదని పోలీసులు చెబుతున్న మాట.