సినీ గేయరచయిత జాలాది కన్నుమూత

'సూరట్టుకు సితుక్కు వానచుక్క" అంటూ జానపద బాణీలతో జన హృదయాలను ఉర్రూతలూగించినా, 'పుణ్యభూమి నాదేశం నమో నమామి"అంటూ దేశ భక్తిని ప్రేరేపించినా అది జాలాదికే చెల్లింది. బాల్యంలో అల్లరి చిల్లరి తిరుగుళ్లు, గొడవలు, పోలీసు కేసులు...ఆయనలోని కవితా సౌరభాన్ని కప్పి ఉంచాయి. కలం పేర్లతో మాత్రమే ఆ కవిత్వం వెలుగు చూసేది. ఉద్యోగానికి రాజీనామా చేశాక, జీవనం భారమైన నేపథ్యంలో మిత్రుల ఒత్తిడితో సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టారు జాలాది. 'యాతమేసి తోడినా ఏరు ఎండదనీ"...'బండెళ్లి పోతుందోరన్నయ్యా.. బతుకు బండెళ్లి పోతుందోరన్నయ్యా" అని...రెండు దశాబ్దాలకుపైగా అనేక బతుకు దృశ్యాలను కళ్లకు కట్టించారు జాలాది రాజారావు.


Click it and Unblock the Notifications











