twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫిల్మ్ ఫెస్టివల్ కు 'మీ శ్రేయోభిలాషి'

    By Staff
    |

    Mee Sreyobhilashi
    "మీ శ్రేయోభిలాషి" చిత్రం తాజాగా ఈనెల 8 నుంచి 17 వరకు న్యూఢిల్లీలో జరుగనున్న ఢిల్లీ హెబిటాట్‌ ఫిలిం ఫెస్టివల్‌లో ప్రదర్శనకు ఎంపికైంది. ఈ విషయాన్ని చిత్ర సమర్పకుడు సి.సి.రెడ్డి తెలియజేశారు. రాజేంద్రప్రసాద్‌ కథానాయకుడుగా విసు ఫిలింస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పతాకంపై వి.ఈశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో డా.వై.సోనియారెడ్డి 2007 సంవత్సరంలో నిర్మించిన 'మీ శ్రేయోభిలాషి' చిత్రం విజయవంతమై ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం నుండి బంగారు నందితో పాటు అనేక సంస్థల నుండి అవార్డులు గెలుచుకోవడమే కాకుండా పలు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో ప్రదర్శింపబడిన సంగతి పాఠకులకు తెలిసిందే.

    ఈ చిత్రోత్సవం తొలిరోజున ఇటీవల ఎనిమిది ఆస్కార్‌ అవార్డులు సాధించిన 'స్లమ్‌ డాగ్‌ మిలియనీర్‌'ను ప్రారంభోత్సవ చిత్రంగా ప్రదర్శించి అనంతరం రెండవ చిత్రంగా 'మీ శ్రేయోభిలాషి' చిత్రాన్ని ప్రదర్శిస్తారని ఆయన తెలిపారు. ఒక మంచి చిత్రం తీస్తే అది ఎంతో గుర్తింపు, గౌరవం తీసుకువస్తుందని చెప్పడానికి 'మీ శ్రేయోభిలాషి' చిత్రం ఒక ఉదాహరణ అని రెడ్డి పేర్కొన్నారు. ఈ చిత్రానికి పని చేసిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలియజేశారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X