Don't Miss!
- Lifestyle డిఫరెంట్ స్టైల్ లో నోనూరించే మటన్ రోస్ట్
- News Viral Video: రాజకీయ దిగ్గజాల కాళ్లు మొక్కిన టీడీపీ అభ్యర్ధి నిమ్మల..!
- Technology ఆంధ్రప్రదేశ్ లో 7.9 మిలియన్ల 5G యూజర్ లతో, Airtel మరో రికార్డు! 5G విస్తరణ వివరాలు
- Finance Gold Rate: మిసైల్ వేగంతో పెరిగిన పసిడి.. నిన్న పడింది నేడు పుంజుకుంది..
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
- Sports వరుస పరాజయాల వేళ.. ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
పవన్ నో చెప్పాడు: ‘కత్తి’ తెలుగు రిలీజ్ డేట్ ఇదే
హైదరాబాద్: విజయ్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన తమిళ చిత్రం కత్తి తమిళనాట భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని తెలుగులో పవన్ కళ్యాణ్ హీరోగా రీమేక్ చేద్దామని అనుకున్నప్పటికీ ఆయన సినిమా చూసి నో చెప్పడంతో ఇక డబ్బంగ్ వెర్షన్ తెలుగులో విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ చిత్రాన్ని తెలుగులో నవంబర్ 21న విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. తమిళనాట ఓపెనింగు రోజు రూ. 15 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ చిత్రం తెలుగులోనూ మంచి విజయం సాధిస్తుందని ఆశిస్తున్నారు. ఇంతకు ముందు విజయ్ నటించిన తుపాకి చిత్రం తెలుగులో కూడా మంచి ఫలితాలు రాబట్టిన సంగతి తెలిసిందే.
ఈ చిత్రం తెలుగు డబ్బింగ్ రైట్స్ ఠాగూర్ మధు సొంతం చేసుకున్నారు. ఈ చిత్రంలో సమంత హీరోయిన్ కావడం కూడా కలిసొచ్చే అంశం. ‘కత్తి' విడుదల ముందు అనేక కష్టాలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం దీపావళికి విడుదలై సూపర్ హిట్ టాక్ తో సూపర్ కలెక్షన్లు సాధిస్తోంది. తాజాగా ఈ చిత్రానికి కోర్టు కష్టాలు మొదలయ్యాయి.
సినిమాలో 2జి స్ప్రెక్ట్రమ్ స్కాం ప్రస్తావన ఉండటంతో మధురైకి చెందిన లాయర్ రామసుబ్రహ్మణ్యం కేసు వేసారు. 2జి స్ప్రెక్ట్రమ్ కేసు ఇంకా విచారణ దశలో ఉండగా సినిమాలో ఆ అంశాన్ని లేవనెత్తడంపై అభ్యంతరం వ్యక్తం చేసారు. ఈ మేరకు హీరో విజయ్, దర్శకుడు మురుగదాస్, సినీ నిర్మాణ సంస్థలపై కేసు వేసారు.
గతంలో విజయ్ హీరోగా చేసిన ‘ఖుషీ' సినిమాని పవన్ తెలుగులో రీమేక్ చేసి బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు.‘కత్తి' సినిమా విషయానికి వస్తే ఇది సెజ్, రైతులకు మధ్య జరిగే పోరాటానికి సంబంధించిన సినిమా. రైతులు తమ భూములను ఎలా కోల్పోతున్నారు. ఎందుకు రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి. వ్యవసాయానికి నీరు ఎంత అవసరం. అటువంటి నీటివనరుని ఆక్రమించి బీరు ఫ్యాక్టరీ కట్టాలనుకునే ఓ మల్టీనేషనల్ కంపెనీని ఓ గ్రామానికి చెందిన యువకుడు ఎలా ఎదుర్కొన్నాడు. రైతులతో ప్రజల్లో ఎలాంటి చైతన్యాన్ని తీసుకువచ్చాడనేదే ప్రధానాంశంగా సినిమా సాగుతుంది.