సినీ ప్రముఖుడు కాశీ విశ్వనాథ్ కన్నమూత
హైదరాబాద్: సినీ ప్రముఖుడు, రచయిత కాశీ విశ్వనాథ్ (68) కన్నుమూసారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన హైదరాబాద్ నుండి విశాఖపట్టణానికి వెళుతుండగా రైల్లో మృతి చెందాడు. ఆయన మరణం పట్ల పలువురు సినీ సెలబ్రిటీలు సంతాపం వ్యక్తం చేసారు.

తెలుగు సినిమాకు ఆయన ఎనలేని సేవలు అందించారు. దాదాపు 70 చిత్రాలకు ఆయన రచయితగా పని చేసారు. తెలుగులో ప్రముఖ దర్శకులైన దాసరి నారాయణరావు, రేలంగి నరసింహారావు, రాజాచంద్ర, విజయబాపినీడు తదితరుల సినిమాలకు ఆయన రచయితగా పని చేసారు.


Click it and Unblock the Notifications











