Don't Miss!
- Finance Medicines News: కిరాణా కొట్టులో మందుల విక్రయం.. మోదీ సర్కార్ సంచలన నిర్ణయం..!!
- Lifestyle ప్రాణాలకు ముప్పు ఉందని తెలిపే హీట్ స్ట్రోక్ లక్షణాలు
- Technology Truecaller Spam Model స్పామ్ కాల్స్కు చెక్ పెట్టేందుకు ట్రూకాలర్ కొత్త టూల్ విడుదల..!
- News ప్రచారం పక్కనపెట్టి గర్భిణీకి ప్రసవం.. దర్శి టీడీపీ అభ్యర్థికి హ్యాట్సాఫ్!!
- Sports అనూహ్య ఘటనను ఎదుర్కొన్న రోహిత్ శర్మ
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
తెలుగు సినీ రచయిత కన్నుమూత
చెన్నై : పాటల, కథా రచయిత పొందూరి హనుమంతరావు (49) సోమవారం సాయంత్రం చెన్నైలో మృతిచెందారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా ఉలిచి గ్రామానికి హనుమంతరావు చిన్నతనం నుంచే రచనపై మక్కువ పెంచుకున్నారు. 23 ఏళ్ల క్రితం చెన్నైలో స్థిరపడిన ఆయన పలు బుల్లితెర ధారావాహికలకు కథలు రాశారు.
శ్రీకాంత్ హీరోగా నటించిన 'వూహ' చిత్రానికి ఆరు పాటలు కూడా రాశారు. కోడిరామకృష్ణ దర్శకత్వంలోని 'లాఠీఛార్జి'కి కొన్ని పాటలు రాశారు. ఇటీవల నాగార్జున నటించిన 'షిరిడి సాయి'కి కథా సహకారం అందించారు. కేజే ఏసుదాస్ పాడిన అయ్యప్ప గీతగుచ్ఛాలకు సాహిత్యం కూడా సమకూర్చారు. కాణిపాక వినాయకుడితోపాటు పలు ఆధ్యాత్మిక గీతగుచ్ఛాలను కూడా రూపొందించారు.
చెన్నైలోని వడపళని, కుమరన్ కాలనీలో ఉంటున్న ఆయన.. సోమవారం మధ్యాహ్నం భోజనం చేసి నిద్రపోయారు. సాయంత్రం 5.00 గంటలకు ఆయన కుమారుడు తలుపుతట్టగా తీయకపోవడంతో.. కిటికీలు పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా నిర్జీవుడై ఉన్నారని బంధువులు తెలిపారు. ఆయనకు ఇద్దరు కుమారులు విశ్వనాథ్, సాయిసంతోష్లు ఉన్నారు.