Don't Miss!
- News బీఆర్ఎస్కు భారీ షాక్: ఎంపీ కే కేశవరావు, మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్లోకి
- Sports RR vs DC: రియాన్ పరాగ్ విధ్వంసం.. 6 బంతుల్లో 5 బౌండరీలు!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
'టెంపర్' లో సెన్సార్ అయిన డైలాగులు ఇవే
హైదరాబాద్ : రేపు (13 వ తేదీ)న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున ఎన్టీఆర్ తాజా చిత్రం టెంపర్ విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఈ చిత్రం సెన్సార్ పూర్తై U/A సర్టిఫికేట్ ని సొంతం చేసుకుంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రంలో ని కొన్ని కాంట్రావర్శీ డైలాగులని సెన్సార్ కట్ చేసింది. మచ్చుకు ఒకటి... "గాంధీ గాంధీ అని అరవడం కాదు...దేశంలో జరిగే ప్రతీ అవినీతికి మొదటి సాక్షి ఈ గాంధీ". ఇంకేమి కట్ చేసారు...ఏ సీన్స్ కు సెన్సార్ ఒప్పుకోలేదో తెలియాలంటే ఈ క్రింద ఇచ్చిన సెన్సార్ సర్టిఫికేట్ చూడాల్సిందే.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రిమియర్ షో లు ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శించనన్నారు. ముఖ్యంగా అమెరికాలో 120 స్క్రీన్స్ లో విడుదలచేయనున్నారు. ఈ సినిమా నిర్మాత బండ్ల గణేష్ ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 13న విడుదలచేయను న్న విషయం తెలిసినదే. ఈ సినిమా ట్రైలర్ విడుదలైన నాటినుండీ అంచనాలు పెరిగిపోతున్నాయి. అనూప్ రూబెన్స్ సంగీత దర్శకుడు. కాజల్ ఆగర్వాల్ హీరోయిన్ గా నటించింది.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
'టెంపర్' సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ వారు ఈ సినిమాకి ‘యు/ఎ' సర్టిఫికేట్ ఇచ్చారు. సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రప్రంచ వ్యాప్తంగా ఫిబ్రవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. పూరి జగన్నాధ్ డైరెక్షన్, స్క్రీన్ ప్లే, పంచ్ డైలాగ్స్ మరియు ఎన్.టి.ఆర్ ని చూపించిన విధానం ఆడియన్స్ ని థ్రిల్ చేస్తుందని సమాచారం. వక్కంతం వంశీ కథ అందించిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించగా, మధురిమ, సోనియా అగర్వాల్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
శివబాబు బండ్ల సమర్పిస్తున్న సినిమా ‘టెంపర్'. పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందిస్తున్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. బండ్ల గణేశ్ నిర్మాత. ఈ సినిమా ఆడియో, ట్రైలర్స్ ఈ మధ్యనే విడుదల అయ్యి మంచి క్రేజ్ సంపాదించుకున్నాయి. ‘టెంపర్' సినిమా రన్ టైం సుమారు 141 నిమిషాలు ఉంటుంది. ఇదే లెంగ్త్ కి ఈ చిత్ర టీం ఫస్ట్ కాపీని రెడీ చేసారని సమాచారం. అందులో ఫస్ట్ హాఫ్ 1 గంట 8 నిమిషాలు, సెకండాఫ్ 1 గంట 13 నిమిషాలు ఉండబోతోంది. ఎన్.టి.ఆర్, అతని టీం సక్సెస్ పై చాలా నమ్మకంగా ఉన్న ఈ సినిమా ఫిబ్రవరి 13న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కావడానికి సిద్దమైంది.
ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో బెనిఫిట్ షోస్ కి సంబందించిన ఏర్పాట్లు కూడా జరిగిపోతున్నాయి. అభిమానులతో పాటు సినీ ప్రేమికులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఎన్.టి.ఆర్ సరసన అందాల భామ కాజల్ అగర్వాల్ హీరోయిన్ కనిపించనున్న ఈ సినిమాలో మధురిమ, సోనియా అగర్వాల్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. బండ్ల గణేష్ భారీ వ్యయంతో నిర్మించిన ఈ సినిమా ఈ రోజు సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకోనుంది.
బండ్ల గణేశ్ మాట్లాడుతూ ‘‘ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మా సినిమా ‘టెంపర్'విడుదలకు సిద్గంగా ఉంది. 13న కనీవిని ఎరుగని రీతిలో గ్రాండ్గా విడుదల చేస్తాం . ఎన్టీఆర్ కెరీర్లో మైల్స్టోన్గా నిలిచిపోతుంది'' అని అన్నారు. చొక్కా లేని ఎన్టీఆర్ను చూసి అభిమానులు ఇప్పటికే సినిమాపై ఓ అంచనాకి వచ్చేశారు. మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరోగా గుర్తింపు తెచ్చుకున్న జూనియర్ ఈ లుక్తో అభిమానులకు మరింత దగ్గరవుతాడనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. పూరి జగన్ తన సినిమాలో హీరోలను విభిన్నంగా చూపించడంలో ముందుంటారు. తాజాగా ఎన్టీఆర్ విషయంలోనూ అదే రిపీట్ అయ్యింది. కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది.
ప్రకాష్రాజ్, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, అలీ, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజు, మధురిమ బెనర్జి, వెన్నెల కిషోర్, జయప్రకాష్రెడ్డి, సప్తగిరి, కోవై సరళ, రమాప్రభ, పవిత్ర లోకేష్ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ సినిమాకు కథ: వక్కంతం వంశీ, కెమెరా: శ్యామ్ కె నాయుడు, సంగీతం: అనూప్ రూబెన్స్, ఆర్ట్: బ్రహ్మ కడలి, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, ఫైట్స్: విజయ్, సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేశ్, స్ర్కీన్ప్లే, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్.