Don't Miss!
- Finance Adani News: గౌతమ్ అదానీ తిరిగొచ్చిన మంచిరోజులు.. ఆ 5 కంపెనీల్లో సంచలనం..
- Technology OnePlus Flip వన్ప్లస్ ఫ్లిప్ ఫోన్ కీలక వివరాలు లీక్... టెలిఫోటో కెమెరా సహా కీలక ఫీచర్లు..!
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- News కాంగ్రెస్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే: రేవంత్తో భేటీ: గ్రేటర్ హైదరాబాద్లో భారీ షాక్
- Lifestyle డిఫరెంట్ స్టైల్ లో నోనూరించే మటన్ రోస్ట్
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
- Sports వరుస పరాజయాల వేళ.. ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్
లండన్ లో రొమాంటిక్ ప్రేమజంట షికారు...
బాలీవుడ్ లోప్రేమాయణాలు ఎప్పుడు ఏ మలుపు తిరుగుతాయో ఎవరూ చెప్పలేరు. కొంత కాలం క్రితం కరీనా కపూర్తో పీకల్లోతు ప్రేమలో మునిగిన షాహీద్ కపూర్ ఆతర్వాత ప్రియాంకా చోప్రాతో ప్రేమాయణం సాగిస్తున్నాడని బాలీవుడ్ లో గుసగుసలు వినిపించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ జంట లండన్ వీధుల్లో షికారు చేస్తున్నారని బాలీవుడ్ వర్గాల సమాచారమ్.
'కమీనే" చిత్రంలో జోడీగా నటించిన ఈ జంట ప్రస్తుతం కునాల్ కోహ్లీ రూపొందిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ 'తేరీ మేరీ కహానీ"లో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం లండన్లో జరుగుతోంది. ఓ పక్క షూటింగ్ జరుగుతుంటే మరో పక్క షూటింగ్ గ్యాప్లో షాహీద్కపూర్, ప్రియాంకా చోప్రా లండన్ వీధుల్లో షికారు చేస్తున్నారట. పైగా ఈ చిత్రం రొమాంటిక్ ఎంటర్ టైనర్ కావడంతో వీరిద్దరి మధ్య ప్రేమాయణం జోరుగా సాగుతోంది కాబట్టే వీరిపై చిత్రీకరిస్తున్న సన్నివేశాల్లో వీరిమధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అవుతోందని యూనిట్ సభ్యులు చెప్పుకుంటున్నారు. 60 దశకం కాలం నాటి కథ నేపధ్యంలో సాగే ఈ సినిమాలో వీరిద్దరి పాత్రలు చాలా కొత్తగా వుంటాయని తెలుస్తోంది.