Don't Miss!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- News సూర్య గోచారంతో మే 13వరకు ఈ రాశులకు సంపద వర్షం
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Sports DC vs GT: అందుకే డేవిడ్ వార్నర్ను పక్కన పెట్టాం: రిషభ్ పంత్
- Lifestyle ఈ బ్లడ్ గ్రూప్ దొరకడం చాలా కష్టం..కొంటే ధర ఎంతో తెలుసా..?
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
నాగచైతన్య-సునీల్ ‘తడాఖా’ ఆడియో వేడుక చీఫ్గెస్ట్గా వెంకటేష్?
హైదరాబాద్: నాగచైతన్య-సునీల్ కాంబినేషన్లో తమిళంలో విజయవంతమైన 'వెట్టై' చిత్రాన్ని బెల్లంకొండ సురేష్ తెలుగులో 'తడాఖా' పేరుతో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. పి. కిశోర్కుమార్(డాలి) దర్శకుడు. నాగ చైతన్య సరసన తమన్నా, సునీల్ సరసన ఆండ్రియా కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రం ఆడియో వేడుక గురువారం శిల్పకళా వేదికలో జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఆడియో వేడుకకు టాలీవుడ్ అగ్రహీరో వెంకటేష్ హాజరవుతున్నట్లు సమచారం. అయితే ఈ విషయం అఫీషియల్ గా ఖరారు కావాల్సి ఉంది. నాగ చైతన్య వెంకటేష్కు మేనల్లుడవుతాడనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వెంకటేష్ను చీఫ్ గెస్ట్గా ఆహ్వానించినట్లు సమాచారం.
తమిళంలో లింగుస్వామి దర్శకత్వంలో 'వెట్టై' చిత్రం రూపొందగా, దానికి రీమేక్గా 'తడాఖా' చిత్రం డాలి దర్శకత్వంలో రూపొందుతోంది. ఈ చిత్రంలో నాగచైతన్య, సునీల్ అన్నదమ్ములుగా నటిస్తున్నారు. సాయిగణేష్ ప్రొడక్షన్స్ పతాకంపై బెల్లంకొండ సురేష్ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు.
బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, అశుతోష్ రాణా, నాగినీడు, ఆహుతిప్రసాద్, జయప్రకాష్రెడ్డి, వెన్నెల కిషోర్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి మూలకథ: లింగుస్వామి, మాటలు, స్క్రీన్ప్లే: ఎ.దీపక్రాజ్, పాటలు: చంద్రబోస్, సంగీతం: తమన్, దర్శకత్వం: పి. కిశోర్ కుమార్(డాలీ).