Don't Miss!
- Sports ఐపీఎల్లో అదరగొడుతున్న అన్ క్యాప్డ్ ప్లేయర్లు వీళ్లే..
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- News సెంటిమెంట్ కలిసొస్తే - అదే ఫలితం రిపీట్...!!
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
- Technology ఎయిర్ కండిషనర్ AC ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా... అయితే ఇవి తెలుసుకోండి..!
- Automobiles కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
బ్యాంకాక్ టీమ్ తో ...ఎన్టీఆర్ ‘బాద్ షా’ధీమ్ మ్యూజిక్
హైదరాబాద్ : ఎన్టీఆర్,శ్రీను వైట్ల కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం 'బాద్ షా'. ఈ చిత్రానికి సంగీతం తమన్ అందిస్తున్నారు. రీసెంట్ గా ఆయన బ్యాంకాక్ కి చెందిన ఫేమస్ ఆర్కెస్ట్రా వారి సాయింతో ధీమ్ మ్యూజిక్ ని ఫినిష్ చేసారు. ఈ విషయాలను,ఫోటోలను ఆయన ట్విట్టర్ లో అప్ లోడ్ చేసారు. సింగర్స్ రాహుల్,రంజిత,సుచరిత బ్యాంకాక్ కి తమన్ తో పాటు వెళ్లి పినిష్ చేసుకు వచ్చారు. ఈ పాట చాలా ఎక్సట్రార్డనరీగా వచ్చిందని శ్రీను వైట్ల చాలా ఇంప్రెస్ అయ్యారని చెప్తున్నారు.
ఇక ఈ చిత్రం సెకెండ్ షెడ్యూల్ బ్యాంకాక్ లో ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని రచయిత గోపీ మోహన్ ట్విట్టర్ లో తెలియచేస్తూ...బాద్షా సెకండ్ షెడ్యూల్ బ్యాంకాక్ లో ఆగస్టు 15న మొదలవుతుంది. అక్కడ విజయ్ మాస్టర్ ఆధ్వర్యంలో ఫైట్స్ చిత్రీకరిస్తారు. అలాగే ఓ పాట,మేజర్ టాకీ సీన్స్ కూడా అక్కడ ఫినిష్ చేస్తారు అని ట్వీట్ చేసారు. అలాగే చిత్రం బిజినెస్ మొదలైన సంగతి తెలిసిందే. ట్రేడ్ లో క్రేజ్ తెచ్చుకున్న ఈ చిత్రం గుంటూరు ఏరియాకు బిజినెస్ పూర్తైనట్లు సమాచారం. హరి వెంకటేశ్వర ఫిక్చర్స్ వారు ఈ చిత్రం రైట్స్ గుంటూరుకు తీసుకున్నారు. ఈ విషయమై నిర్మాత బండ్ల గణేష్ చాలా హ్యాపీగా ఉన్నారు.
ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన కాజల్ అగర్వాల్ నటిస్తోంది. జూ ఎన్టీఆర్-కాజల్ కాంబినేషన్లో ఇప్పటికే బృందావనం లాంటి హిట్ సినిమా రావటంతో మంచి క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు. ఫ్యామిలీ అండ్ హిల్లేరియస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈచిత్రానికి తమన్ సంగీతం అందించనున్నాడు. ఇప్పటికే రెడీ, దూకుడు లాంటి చిత్రాలతో మంచి క్రేజ్ సంపాదించుకున్న శ్రీను వైట్ల ఈ సారి అంతకు మించిన ఎంటర్ టైన్మెంట్ సబ్జెక్టుతో 'బాద్ షా' చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. దూకుడు చిత్రానికి పని చేసిన రచయితలు కోన వెంకట్, గోపీ మోహన్, సంగీత దర్శకుడు తమన్ తో పాటు చాలా మంది టెక్నీషియన్స్ 'బాద్ షా' చిత్రానికి పని చేస్తున్నారు. ఈ సినిమా మరో దూకుడు అవుతుందని,ఆ రేంజిని దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు.
ఇక ఎన్టీఆర్ సైతం ఈ చిత్రంపై చాలా నమ్మకంగా ఉన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ...సినిమా హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది అన్నారు. శ్రీను వైట్ల,ఎన్టీఆర్ కాంబినేషన్ అంటే జనం రకరకాలు అంచనాలు వేస్తున్నారు. వాటినన్నిటికీ అతీతంగా కథ,కథనం ఉంటాయి. పూర్తిగ మొదటినుంచి చివరి వరకూ పొట్ట పగిలేలా నవ్విస్తాము అన్నారు. గబ్బర్ సింగ్ తో సూపర్ హిట్ కొట్టిన గణేష్,దూకుడుతో సూపర్ హిట్ కొట్టిన శ్రీనువైట్ల కాంబినేష్ కాబట్టి తమకీ ఆ రేంజి హిట్ పడుతుందని ఎన్టీఆర్ పూర్తి నమ్మకంగా ఉన్నారు. ట్రేడ్ లో సైతం ఆ నమ్మకంతో హైప్ క్రియేట్ అవుతోంది.