Don't Miss!
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
- Technology ఎయిర్ కండిషనర్ AC ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా... అయితే ఇవి తెలుసుకోండి..!
- News నాకు అండగా, చీకటిలో వెలుగుగా..
- Travel వేసవిలో సందర్శించేందుకు దేశంలోని బెస్ట్ ఆఫ్బీట్ హిల్ స్టేషన్లు ఇవే..
- Automobiles కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
కన్నీరు ఆగడం లేదు.. ప్లీజ్ మామా త్వరగా రండి.. ఎస్పీబీపై తమన్ ఎమోషనల్
ప్రస్తుతం దేశం మొత్తం ఒక్కటే కోరుకుంటుందో.. ప్రపంచ సంగీత ప్రేమికులందరీ ప్రార్థన ఒక్కటే. గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా కరో్నా పోరాడి జయించారు. ఆరోగ్యం స్థిమిత పడుతోందని అందరూ అనుకుంటున్న వేళ మళ్లీ అందోళనలు మొదలయ్యాయి. నిన్న సాయంత్రం నుంచి ఎస్పీబీ ఆరోగ్యం విషమించిందనే వార్తలు అందర్నీ ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఆయన ఆరోగ్యం కుదుటపడాలని, తొందరగా కోలుకోవాలని సెలెబ్రిటీలందరూ ప్రార్థనలు చేస్తున్నారు.
ఇది తప్పదని తెలుసు..
ఇది మనందరికీ తప్పదని తెలుసు.. అయినా సరే నొప్పిగా ఉంది.. చాలా బాధ పెడుతోంది.. ఇది నిజం కాకూడదని ఆశిస్తున్నాను.. ప్రార్థిస్తున్నాను. ఓ గాండ్ అంటూ కృష్ణవంశీ కన్నీరు పెట్టుకున్నంత పని చేశాడు. ఇక ఆ ట్వీట్ చేసిన నెటిజన్లు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
ఈ ఏడాది ఎందుకిలా ఉంది..
ద్వేషం అనే పదం నాకు భారంగా ఉంటుంది.. కానీ ఈ ఏడాదిని నేను ఎంతో ద్వేషిస్తున్నాను. హృదయం బద్దలయ్యే వార్తలు వింటూనే ఉన్నాను అంటూ రాధిక ఎమోషనల్ అయింది. నిన్న రాత్రి రాధిక చేసిన ఈ ట్వీట్ అందర్నీ ఆందోళనలో పడేసింది.
మామా మామా ప్లీజ్..
లాక్ డౌన్కు ముందు మ్యూజిషియన్స్ అందరూ కలిసి పాల్గొన్న ఈవెంట్కు సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ తమన్ ఎమోషనల్ అయ్యాడు. ఏడుపొస్తుంది.. ప్లీజ్ మామా రండి మామా.. త్వరగా కోలుకుని రండి మామా అంటూ ఎస్పీబీపై ప్రేమను కురిపించాడు తమన్. మీ అందరి ప్రార్థనలు కావాలి.. అందరం కలిసి ప్రార్థిద్దాం.. లవ్యూ మామ అంటూ తమన్ చేసిన ట్వీట్కు అందరూ ఎమోషనల్ అవుతున్నారు.
మంచు లక్ష్మీ ఎమోనల్
మీతో మా ప్రయాణం.. మాతో మీ ప్రయాణం ఇంకా పూర్తవ్వలేదు.. ఈ కష్టాన్ని ఎదురించి మా కోసం తిరిగి రండి.. దేవుడా ఇది నీ టైం.. నీ దయను మా మీద చూపించు అంటూ మంచు లక్ష్మీ ఎమోషనల్ అయింది. కేవలం తెలుగు సింగర్సే కాకుండా ప్రతీ ఒక్క సెలెబ్రిటీ, సామాన్య జనం ఎస్పీబీ కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు.