Don't Miss!
- News ఏప్రిల్ 1న రూ.2000 నోట్ల డిపాజిట్, ఎక్స్ఛేంజ్ -ఆర్బీఐ కీలక ప్రకటన..!
- Sports RCB vs KKR: వేరీజ్ మ్యాడ్ మ్యాక్సీ: ఆర్సీబీలో గందరగోళం
- Finance Bank Holidays: ఏప్రిల్ లో 14 రోజులు బ్యాంకులకు సెలవులు..
- Automobiles కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
ప్రభాస్ సరే...మహేష్బాబు అయితే షాకిచ్చారు!
హైదరాబాద్ : ఓ చిన్న చిత్రం విడుదల అవుతోందంటే దానికి పెద్ద స్దాయి ప్రమోషన్ అవసరం. అటువంటిదే తను నేను చిత్రం అందుకుంటోంది. అందుకు కారణం ఈ చిత్రంలో హీరోగా నటించిన సంతోష్ శోభన్. అతనికి ప్రభాస్, రవితేజ, మహేష్ బాబు వంటి వారు విషెష్ తెలిపి సినిమాపై అందరి దృష్టి పడేలా చేసారు.
'వర్షం', 'బాబి', 'చంటి' చిత్రాలను అందించిన దర్శకుడు శోభన్. ఆయన తనయుడే సంతోష్ శోభన్. 'తను నేను' తో హీరోగా పరిచయమవుతున్నాడు. రామ్మోహన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిందీ చిత్రం. విడుదల సందర్బంగా హైదరాబాద్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసారు.
సంతోష్ మాట్లాడుతూ ''ప్రభాస్, రవితేజ, నాని, త్రివిక్రమ్ నన్ను ఆశీర్వదించారు. మహేష్బాబుగారైతే... ట్విట్టర్లో నా గురించి ప్రస్తావించి షాకిచ్చారు. వాళ్లందరి దీవెనలు అందుకొంటుంటే నాన్న మా మధ్యే ఉన్నారనిపిస్తోంది. చిన్నప్పటి నుంచీ సినిమాలంటే ఇష్టం. 'తను నేను' లాంటి చక్కటి కుటుంబ కథా చిత్రంతో హీరోగా మారడం సంతోషాన్నిచ్చింది. ప్రేమ, వినోదం, మంచి సంగీతం మేళవించిన ఈ చిత్రం అందరికీ నచ్చుతుందన్న నమ్మకం ఉంది''అన్నాడు.
రీసెంట్ గా మహేష్ బాబు త్వరలో విడుదలకు సిద్దమవుతున్న చిత్రం తను-నేను కు చెందిన ట్రైలర్ ని షేర్ చేస్తూ, విషెష్ చెప్పారు. అలాగే...ఈ సినిమా ద్వారా పరిచయమవుతున్న హీరో మరెవరో కాదని, తనతో ప్రత్యేక అనుబంధం ఉన్న దర్శకుడు స్వర్గీయ శోభన్(బాబి దర్శకుడు, నాని మాటల రచయిత) కుమారుడు అని తెలియచేసారు. అతని తొలి చిత్రం విడుదలకు సిద్దంగా ఉందని, శుభాకాంక్షలు తెలియచేసారు.