Don't Miss!
- News ఐటీ హబ్ లో హైఅలర్ట్, దెబ్బకు అన్ని కంపెనీలకు సెలవు, ఓటు సరే పెళ్లామ్ తో జంప్!
- Sports మా పక్కింటి ఆంటీ గొడవ వల్ల క్రికెటర్ను అయ్యాను: నితీశ్ కుమార్ రెడ్డి వీడియో
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అమలా పాల్ తెగింపు... దర్శకుడి మాట వినకుండా అన్నీ విప్పేసి నగ్నంగా!
హీరోయిన్ అమలా పాల్ 'ఆడై'(తెలుగులో 'ఆమె') సినిమాతో సంచలనం క్రియేట్ చేయబోతున్నారు. ఈ మూవీ కోసం ఒంటిపై నూలు పోగు కూడా లేకుండా నగ్నంగా నటించిన ఆమె పెద్ద సాహసమే చేసిందని చెప్పాలి. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం... ఇటీవల విడుదలైన న్యూడ్ టీజర్ ఎఫెక్టుతో భారీ హైప్ సొంతం చేసుకుంది.
కేవలం నగ్నంగా నటించడం మాత్రమే కాదు... ఇందులో అమలా పాల్ లెస్బియన్(స్వలింగ సంపర్కం) సీన్లలో కూడా నటించిందట. తమిళ నటి, విజే రమ్యతో కలిసి శృంగార సన్నివేశాలు చేసినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో న్యూడ్ సీన్లు, అమలా-రమ్య ముద్దు సీన్లు వైరల్ అవుతున్నాయి.
దర్శకుడి మాట వినకుండా అన్నీ విప్పేసి నగ్నంగా!
వాస్తవానికి సినిమాలోని న్యూడ్ సీన్లు చేసేపుడు స్కిన్ కలర్లో ఒంటికి అతక్కుపోయేలా ఉండే డ్రెస్ ధరించాలని దర్శకుడు సూచించాడట. అయితే అమలా పాల్ దర్శకుడి మాట వినకుండా ఆ సీన్లలో రియాల్టీ ఉట్టిపడాలనే ఉద్దేశ్యంతో తనకు ఆ డ్రెస్ అవసరం లేదని, నగ్నంగా నటిస్తానని ముందుకు వచ్చిందట. ఈ విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె స్వయంగా వెల్లడించారు.
న్యూడ్ సీన్స్ షూటింగ్ సమయంలో వారు మాత్రమే...
అమలా పాల్ న్యూడ్ సీన్ చెన్నైలోని ఫ్యాక్టరీలో చిత్రీకరించారు. ముఖ్యమైన సీన్ కాబట్టే తాను నగ్నంగా నటించాలని నిర్ణయించుకున్నాను. షూటింగ్ సమయంలో కెమెరామెన్, డైరెక్టర్, చిత్రీకరణకు సహాయ పడే సిబ్బంది మొత్తం ఆరుగురు మాత్రమే సెట్లో ఉన్నట్లు అమలా పాల్ తెలిపారు.
లెస్బియన్ సీన్లు
మరో వైపు అమలా పాల్, విజే రమ్య మధ్య చిత్రీకరించిన ముద్దు సీన్లు కూడా ‘ఆడై' చిత్రం మరింత హైలెట్ అయ్యేలా చేసింది. ఇంతకీ ఈ చిత్రం కథ ఏమిటి? ఎలాంటి కాన్సెప్టుతో ఉండబోతోంది అనేది హాట్ టాపిక్ అయింది. అమలా పాల్ కెరీర్లో అత్యంత వివాదాస్పద చిత్రంగా వార్తల్లోకి ఎక్కిన ఈ మూవీలో ఆమె నటన అవార్డులు అందుకునే స్థాయిలో ఉంటుందని అంటున్నారు.
ఆమె
‘ఆడై' చిత్రం తెలుగులో ‘ఆమె' పేరుతో విడుదల కాబోతోంది. తమిళ చిత్రం 'మయాతా మాన్' మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రత్నకుమార్ దర్శకత్వం వహిస్తుండగా 'వి స్టూడియోస్' సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. జులై 19న ఈ మూవీ వరల్డ్ వైడ్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.