twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎడారిలో... పరాటాలు తింటూ రాజమౌళి వేట!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : దర్శకుడు రాజమౌళి 'బహుబలి' అనే భారీ బడ్జెట్ సినిమాను తీసేందుకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈచిత్రానికి లొకేషన్లు వెతికే పనిలో ఉన్నాడు రాజమౌళి. ఇటీవలే కర్నాటక, కేరళల్లో పలు లొకేషన్లను పరిశీలించిన రాజమౌళి ఈ వారం రాజస్థాన్ లో లొకేషన్ల వేటలో ఉన్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్లో వెల్లడించిన రాజమౌళి...మగధీర సినిమా షూటింగు జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు. అంతే కాదు అక్కడ తిన్న ఆలూ పరాటాలు యమటేస్టీగా ఉన్నాయంటూ ట్విట్టర్లో అందుకు సంబంధించిన ఫోటోలు పోస్టు చేసాడు.

    ఇక బహుబలి సినిమా విషయానికొస్తే...
    మగధీర తర్వాత ఆ రేంజిలో భారీ బడ్జెట్‌తో రాజమౌళి ప్లాన్ చేసిన సినిమా ఇది. ప్రభాస్ హీరోగా రూపొందుతున్న ఈచిత్రంలో రాణా విలన్ పాత్రలో కనిపించనున్నాడు. ఈచిత్రంలో వీరిద్దరి మధ్య కత్తియుద్ధం సన్ని వేశాలు ఉండనున్నాయి. ఈ మేరకు వీరిద్దరికి కత్తియుద్దంలో ట్రైనింగ్ ఇస్తున్నారు.

    ఈ భారీ సినిమా గురించి చాలా కాలంగా ప్రేక్షకులు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఎట్టకేలకు ఈ ప్రాజెక్టు ప్రారంభ దశకు చేరకుంది. త్వరలోనే ఇది సెట్స్‌పైకి వెళ్లబోతోంది. 'బహుబలి' టైటిల్‌తో రూపొందబోయే ఈ సినిమాను రాఘవేంద్రరావు, శోబు ఆర్కా మీడియా బేనర్ పై నిర్మిస్తున్నారు.

    ఈ మూవీకి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఆర్కా మీడియా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో రూపొందిస్తోంది. ఈ చిత్రానికి ప్రముఖ కళా దర్శకుడు సాబు సిరిల్‌ పని చేయబోతున్నారు. సాబు జాతీయస్థాయిలో నాలుగు పర్యాయాలు ఉత్తమ కళాదర్శకుడిగా పురస్కారాలు అందుకున్నారు. త్వరలో ఈ చిత్రాన్ని సెట్స్‌ మీదకు తీసుకెళ్తారు.

    English summary
    
 Rajamouli reportedly in Rajasthan to scout for more locations."The aloo paratha is delicious and the pickle is sssssspicccccy…:) And durgaji(not in pic) refuses to take money, Memories of magadheera flooding as we go scouting locs. What fun we had" He tweeted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X