Don't Miss!
- Automobiles మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- Technology Dell నుంచి నాలుగు కొత్త Ai ల్యాప్టాప్లు! ధర,స్పెసిఫికేషన్లు
- News భారీ వర్షం - వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..!!
- Sports రోహిత్పై గౌరవం..అంతకుమించి ఏం లేదు: పుకార్లపై ప్రీతి జింటా ఫైర్
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
షూటింగులో కరెంటు షాక్, కెమెరామెన్ అమర్ మృతి
హైదరాబాద్: తెలుగులో పలు చిత్రాలకు పని చేసిన సినిమాటోగ్రాఫర్ అమర్ అక్టోబర్ 25న కరెంటు షాక్తో మృతి చెందారు. ఓ బోజ్పురి చిత్రం షూటింగులో భాగంగా ఉత్తర ప్రదేశ్లో ఉన్న ఆయన షూటింగు స్పాట్లో విద్యుత్ ఘాతానికి గురయ్యారు. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ...అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు దృవీకరించారు.
నెల్లూరు జిల్లా ముత్తుకూరులో జన్మించిన అమర్.....ఎస్.గోపాల్ రెడ్డి దగ్గర దాదాపు ఇదరవై ఐదు చిత్రాలకు పని చేసారు. మోహన్ బాబు నటించిన శివశంకర్ చిత్రానికి అమర్ కెమెరా మెన్గా పని చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. దీంతో పాటు శ్రీకాంత్ నటించిన 'ప్రేమ సందడి' సినిమాతో పాటు 15 చిత్రాలకు పని చేసారు.
అమర్ సినిమాటోగ్రఫీ అందించిన 'బ్యాండ్ బాజా' చిత్రం త్వరలో విడుదల కానుంది. అమర్ మృతి పట్ల పలువురు తెలుగు సినిమా ప్రముఖులు దిగ్ర్బాంటి వ్యక్తం చేయడంతో పాటు ఆయన కుటుంబానికి సంతాపం ప్రకటించారు. తెలుగు సినిమాటోగ్రాఫర్ల సంఘం అమర్ మృతికి నివాళులు అర్పించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.