twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాహుబలి: ది బిగినింగ్‌..... కంటే ముందు జరిగింది తెలుసుకోవాలనుందా?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో తరకెక్కిన 'బాహుబలి-ది బిగినింగ్' చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. తెలుగు సినిమా ఖ్యాతిని ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్లిన సినిమా ఇది. త్వరలో పార్ట్-2 'బాహుబలి-ది కంక్లూజన్' ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రం ఏప్రిల్‌ 28న విడుదల కాబోతోంది.

    'బాహుబలి-ది బిగినింగ్' కంటే ముందు జరిగిన విషయాలు ఇంకా సినిమా రూపంలోకి రాక పోయినా.... పుస్తక రూపంలోకి రాబోతున్నాయి. ప్రముఖ రచయిత నీలకంఠన్‌ రచించిన 'ది రైజ్‌ ఆఫ్‌ శివగామి' పేరుతో పుస్తకాన్ని రచించారు. ఈ పుస్తకం కవర్‌పేజీని జయపుర్ సాహిత్య వేడుకలో ఆవిష్కరించారు. మార్చి 7 నుంచి ఈ పుస్తకం పాఠకులకు అందుబాటులోకి రానుంది.

    'బాహుబలి' చిత్రంలో ప్రధాన పాత్ర అయిన శివగామి ఆధారంగా ఈ పుస్తకాన్ని రచించారు. 'బాహుబలి: ద బిగినింగ్‌' కంటే ముందు ఏం జరిగింది అనే విషయాలను ఇందులో పొందు పరిచారని దర్శకుడు రాజమౌళి తెలిపారు.

    ఈ కార్యక్రమానికి చాలా తక్కువ మంది వస్తారనుకున్నా. కానీ 'ద రైజ్‌ ఆఫ్‌ శివగామి' పుస్తక కవర్ పేజీ ఆవిష్కరణ కార్య‌క్ర‌మానికి మంచి స్పందన వచ్చింది' అంటూ దర్శకుడు రాజమౌళి ట్వీట్‌ చేశారు.

    English summary
    "Thank u for all the love Jaipur. The Cover of 'The Rise of Sivagami'...The book will be available from March 7th. I expected a small gathering at Jaipur Literature Festival. The turnout for the book cover launch of 'The Rise of Sivagami' was overwhelming" Rajamouli tweeted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X