Don't Miss!
- News ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై సస్పెన్షన్ వేటు
- Sports PBKS vs MI: చెలరేగిన సూరీడు... తెలుగోడు!
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
పొల్లాచిలో పవన్-జూ ఎన్టీఆర్ లకి ఆటంకం...!?
ఈ మధ్య మన తెలుగు సినిమాలకు సంబంధించిన యాక్షన్ ఎపిసోడ్ దృశ్యాలను చిత్రీకరించడానికి చాలామంది దర్శక నిర్మాతలు తమిళనాడులోని పొల్లాచ్చి పరిసరాలకు వెళుతున్నారు. హిల్ బ్యాక్ డ్రాప్ తో కూడిన గ్రీనరీ అక్కడ బాగుండడంతో ఆ లొకేషన్లను తమ షూటింగుకు ఎంచుకుంటున్నారు. ప్రస్తుతం అక్కడ రెండు తెలుగు సినిమాల షూటింగులు జరగాల్సివుంది. అయితే, ప్రస్తుతం పొల్లాచ్చి ప్రాంతంలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు పడి, నేల చిత్తడిగా మారడంతో షూటింగుకి అనువుగా లేదక్కడ.
ప్రస్తుతం తమిళనాడులో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతోన్న 'గబ్బర్ సింగ్" షూటింగ్ గత కొన్ని రోజులుగా అక్కడ జరుగుతోంది. కానీ వర్షాల కారణంగా అక్కడ షూటింగ్ ని రద్దు చేసుకుని ఈ యూనిట్ హైదరాబాద్ వచ్చేసింది. ఇక పొల్లాచ్చిలో షూటింగ్ ప్లాన్ చేసుకున్న జూ ఎన్టీఆర్ 'దమ్ము" షూటింగ్ కూడా వర్షాల కారణంగా వాయిదా పడే అవకాశముందని తెలుస్తోంది. ఈ 12 నుంచి అక్కడ జరగాల్సిన ఎన్టీఆర్ సినిమా 'దమ్ము' వర్షాలు తగ్గి, నేల ఆరాక తిరిగి ఈ చిత్రాల షూటింగు అక్కడ కొనసాగవచ్చు!