Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
దటీజ్ బాలయ్య స్టామినా:‘గౌతమిపుత్ర శాతకర్ణి’ ఒక టిక్కెట్ రేటు రూ.1,00,100
నందమూరి బాలకృష్ణ ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రం బెనిఫిట్ షో టిక్కెట్ రేటు వింటే ఆశ్చర్యపోతారు.
హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ వందో చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి' ఈ రోజు భారీ ఎత్తున విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో చిత్రం టిక్కెట్ ఓ అభిమాని భారీ ధర వెచ్చించి కొనుగోలు చేశాడు. కూకట్పల్లిలోని భ్రమరాంబ థియేటర్లో ఈ సినిమా బెనిఫిట్ షో వేశారు. ఈ సందర్భంగా గోపీచంద్ అనే అభిమాని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి విరాళంగా రూ.1,00,100కు టికెట్ కొనుగోలు చేశాడు.
పండుగ వాతావరణంలో జరుగుతున్న ఈ ప్రీమియర్ షో కి బాలకృష్ణ హాజరుకానున్న సంగతి తెలిసిందే. బాలయ్య తన అభిమానులతో కలిసి సినిమా చూడడం తో అత్యంత ప్రాధ్యాన్యత సంతరించుకుంది ఈ ప్రీమియర్ షో. ఈ థియేటర్లోనే దర్శకుడు రాజమౌళి, కొరటాల శివ ఈ బెనిఫిట్ షో చూస్తున్నారు.
ఈ షో కి మొదటి టికెట్ ను రూ.1,00,100 కి గోపిచంద్ యిన్నమూరి అనే అభిమాని దక్కించుకున్నారు. బాలయ్య ఆ అభిమానితో కలిసి సినిమా వీక్షించనున్నారు. ఎప్పుడు సేవ మార్గంలో ఉండే బాలయ్య బాట లోనే బెనిఫిట్ షో నిర్వాహకులు ఈ టికెట్ మొత్తాన్ని బసవతారకం ఇండో అమెరికన్ కాన్సర్ ఆసుపత్రికి అందచేయనున్నారు. ప్రీమియర్ షో నిర్వాహకులైన మనబాలయ్య.కాం నవీన్ మోపర్తి మొదటి టికెట్ సొంతం చేసుకున్న అభిమానికి నారా రోహిత్ చేతుల మీదుగా టికెట్ ను అందచేశారు.
బాలకృష్ణ మాట్లాడుతూ...తాను నటించిన తాజా చిత్రం "గౌతమిపుత్ర శాతకర్ణి" పంచభక్ష్యపరమాన్నాలతో కూడిన విందుభోజనంలా ఉంటుందని అన్నారు. ప్రజాసంక్షేమమే పరమావధిగా దేశాన్ని పరిపాలించిన గొప్ప చక్రవర్తి గౌతమి పుత్రశాతకర్ణి. భరతజాతికి నూతన శకాన్ని ప్రసాదించాడు. రాజసూయ యాగం చేసిన మహా చక్రవర్తి. తెలంగాణలోని కోటిలింగాలలో పుట్టి మెదక్లోని కొండాపూర్ మొదలుకొని అమరావతి, ప్రతిష్టానపురం ఇలా దేశం నలుదిశలా తన సామ్రాజాన్యి విస్తరించిన పరాక్రమశీలి.
అలాంటి గొప్ప చక్రవర్తి కథతో క్రిష్ ఈ సినిమాను అద్భుతంగా తీర్చిదిద్దారు. పంచభక్ష్యపరమాన్నాలతో కూడిన విందుభోజనంలా సినిమా ఉంటుంది. అభిమానులతో కలిసి మొదటి రోజు చూడాలనే ఆలోచనతో ఉన్నాను. అందుకే ఇప్పటివరకూ సినిమాను చూడలేదు. ఇలాంటి మంచి సినిమాల్ని ప్రోత్సహించాలనే ఆలోచనతో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు వినోదపు పన్ను మినహాయింపును ప్రకటించాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని తెలిపారు.
అదేసమయంలో తన కెరీర్లో ఎన్ని సినిమాలు చేశామనేది ముఖ్యంకాదు. సమాజానికి ఉపయోగపడే మంచి సినిమాలు చేయాలన్నదే నా అభిమతం. సాంఘికం, జానపదం, పౌరాణికం..ఇలా అభిమానుల అండ వల్లే అన్ని రకాల సినిమాలు చేయగలిగినట్టు బాలకృష్ణ చెప్పుకొచ్చారు.