Don't Miss!
- Sports DC vs SRH:ట్రావిస్ హెడ్, షెహ్బాజ్ అహ్మద్ విధ్వంసం.. ఢిల్లీ ముందు భారీ లక్ష్యం
- News సుమలత దెబ్బకు మాజీ సీఎం హడల్, ఇంతవరకు ప్రచారం చెయ్యలేదు, అసలు మ్యాటర్ !
- Technology Whatsapp File Sharing Feature వాట్సాప్లో కొత్త ఫీచర్.. సులభంగా ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు..!
- Lifestyle మీ భార్యతో ఇలా ఎప్పుడైనా ఉన్నారా..? ఆ విషయంలో భర్త తగ్గాల్సిందే..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
ప్రధాని మోడీ ఎఫెక్ట్..... మహేష్ బాబు 25 మూవీ కష్టాలకు కారణం అదేనా?
'భరత్ అనే నేను' సినిమా బ్లాక్ బస్టర్ విజయంతో మంచి జోష్ మీద ఉన్న మహేష్ బాబు తన కెరీర్లో 25వ సినిమాపై మరింత శ్రద్ధ పెట్టారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మహేష్ గత సినిమాలు భిన్నంగా గడ్డం లుక్తో కనిపించబోతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఈ నెల మొదట్లో డెహ్రడూన్లో మొదలైంది. ఇక్కడ దాదాపు 2 నెలల భారీ షెడ్యూల్ ప్లాన్ చేశారు. ఇక్కడి ఫారెస్ట్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్లో ఎక్కువ సీన్లు ప్లాన్ చేశారు. అయితే అనుకోని విధంగా షూటింగ్ మొదలైన కొన్ని రోజులకే ఆపాల్సిన పరిస్థితి వచ్చింది.
కారణం ప్రధాన మంత్రి కార్యక్రమం
ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా జూన్ 21న డెహ్రడూన్లోని ఫారెస్ట్ రీసెర్చ్ సెంటర్లో జరిగిన వేడుకలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హాజరయ్యారు. అయితే ప్రధాని సెక్యూరిటీ సిబ్బంది అంతకంటే ముందుగానే ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకోవడంతో మహేష్ బాబు షూటింగ్ వాయిదా వేయక తప్పలేదు. దీంతో దాదాపు నెల రోజుల పాటు ఈ షెడ్యూల్ డిలే అయ్యే పరిస్థితి ఏర్పడింది. ఉత్తరఖండ్ ప్రభుత్వం నుండి అనుమతుల విషయంలో ఇబ్బందులు ఎదురవ్వడానికి కారణం కూడా ఇదేరట. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మహేష్ బాబు మూవీ టీం సపోర్ట్
ప్రధాన మంత్రి వస్తున్న కార్యక్రమం, పైగా ఆరోగ్యంపై చైతన్యం కల్పించే యోగాకు సంబంధించి అంశం కావడంతో మహేష్ బాబు మూవీ టీంకు కూడా తమ పూర్తి సహకారాన్ని అందిస్తూ షూటింగును వాయిదా వేసుకున్నారు.
వచ్చే వేసవి సీజన్లోనే..
వాస్తవానికి షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ డిసెంబర్ వరకు పనులు పూర్తి చేయాలని, సంక్రాంతికి విడుదల చేయాలని అనుకున్నారు. అనుకోని కారణాలతో సినిమా ఆలస్యం కావడంతో సంక్రాంతికి ఈ చిత్రం వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. సమ్మర్ సీజన్లో ఈచిత్రం విడుదలయ్యే అవకాశం ఉందని టాక్.
రైతుల సమస్యలపై?
కాగా.. ఈ సినిమాకు సంబంధించిన కథాంశం రైతుల సమస్యల టచ్ చేస్తుందని, అన్నదాతల ఇబ్బందులు ఇందులో ఫోకస్ చేయబోతున్నారని తెలుస్తోంది. దీంతో పాటు మంచి వినోదాత్మక అంశాలను జోడించి దర్శకుడు వంశీ పైడిపల్లి స్కిప్టు తయారు చేసుకున్నారట.
మహేష్ 25
శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ మరియు వైజయంతీ మూవీస్ పతాకాలపై ప్రముఖ నిర్మాతలు సి.అశ్వనీదత్, దిల్రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంగీతం: దేవిశ్రీప్రసాద్, కథ: వంశీ పైడిపల్లి, హరి, సాల్మన్, సినిమాటోగ్రఫీ: పి.ఎస్.వినోద్, నిర్మాతలు: సి.అశ్వనీదత్, దిల్రాజు, దర్శకత్వం: వంశీ పైడిపల్లి.