Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
Akhanda రిలీజ్కు ముందు తెలంగాణ హైకోర్టు సంచలన నిర్ణయం.. టికెట్ రేట్ల పెంపుపై కీలక ఆదేశాలు!
కరోనావైరస్ కారణంగా లాక్డౌన్ విధించడంతో దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమ సంక్షోభంలో మునిగిపోయింది. దాదాపు ఏడాదికిపైగా సినిమా థియేటర్లు మూతపడటంతో సినీ కార్మికులు, యాజమాన్యాలు రోడ్డున పడ్డారు. ఇటీవల థియేటర్లు ఓపెన్ కావడంతో ప్రేక్షకుల స్పందన అంతంతా మాత్రంగానే ఉంది. దాంతో సినీ పరిశ్రమ గడ్డుపరిస్థితిని ఎదుర్కొంటున్నది.
ఇలాంటి పరిస్థితుల్లో భారీ బడ్జెట్తో రూపొందించిన ఆచార్య, RRR, పుష్ప, అఖండ, రాధేశ్యామ్ లాంటి సినిమాలు రిలీజ్కు సిద్ధమవుతున్నాయి. అయితే ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు టికెట్ల రేట్లు పెంపు అంశంపై నిరాసక్తతతో ఉన్నాయి. అయితే టికెట్ల రేట్లు పెంచుకోవడానికి వెసులుబాటు కల్పించాలనే ఇటీవల థియేటర్ యాజమాన్యాలు తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. అయితే ఈ అంశంపై తెలంగాణ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. టికెట్ రేట్లు పెంచుకోవడానికి వెసులుబాటు కల్పిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. ఆ వివరాల్లోకి వెళితే..
ఇటీవల టికెట్ రేట్లు పెంపుపై థియేటర్ యాజమాన్యాలు తెలంగాణా సర్కార్కు వినతి పత్రం సమర్పించారు. అఖండ, RRR, పుష్ప లాంటి సినిమాల రిలీజ్ సమయంలో టికెట్ రేటును 50 రూపాయల మేరకు పెంచుకొనేలా అవకాశం కల్పించండి అని తమ వినతి పత్రంలో పేర్కొన్నారు. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ థియేటర్ యాజమాన్యం దాఖలు చేసిన పిటిషన్ను తెలంగాణ హైకోర్టు విచారించింది. టికెట్పై రూ.50 పెంచుకొనే విధంగా వెసులుబాటును హైకోర్టు కల్పించింది.
Recommended Video
టికెట్ రేట్ల పెంపుపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై థియేటర్ యాజమాన్యాల తరఫు న్యాయవాది స్పందించారు. టికెట్ రేట్ పెంపుపై తెలంగాణ ప్రభుత్వం స్పందించకపోవడంతో కోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఉన్న రేట్లకు అదనంగా టికెట్ ఒక్కంటికి 50 రూపాయలు పెంచుకొనే విధంగా అవకాశం కల్పిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.