Don't Miss!
- Finance Iran-Israel War: స్టాక్ మార్కెట్లపై ఇరాన్-ఇజ్రాయెల్ వార్ ప్రభావం ఇదే..!! జాగ్రత్త..
- News కాంగ్రెస్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే: రేవంత్తో భేటీ: గ్రేటర్ హైదరాబాద్లో భారీ షాక్
- Lifestyle డిఫరెంట్ స్టైల్ లో నోనూరించే మటన్ రోస్ట్
- Technology ఆంధ్రప్రదేశ్ లో 7.9 మిలియన్ల 5G యూజర్ లతో, Airtel మరో రికార్డు! 5G విస్తరణ వివరాలు
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
- Sports వరుస పరాజయాల వేళ.. ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
సినీ ప్రియులకు కేంద్రం శుభవార్త: రేపటి నుంచి ‘ఫుల్లు’గా ఎంజాయ్ చేయొచ్చు
భారతదేశంలో క్రికెట్ తర్వాత అంతగా ఆదరణ లభించేది సినీ రంగానికి మాత్రమేనన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మిగిలిన దేశాలతో పోలిస్తే ఇక్కడ మాత్రమే సినిమాల విడుదలను పండుగలా జరుపుకుంటుంటారు. అందుకే సినిమా రంగం ద్వారా ప్రభుత్వాలకు కూడా ఎంతో ఆదాయం లభిస్తుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా వైరస్ ప్రభావం వినోద రంగంపై తీవ్ర ప్రభావాన్నే చూపించింది. లాక్డౌన్ కారణంగా మార్చి నెల నుంచే సినిమా షూటింగ్లు నిలిచిపోయాయి. ఫలితంగా థియేటర్లు కూడా మూతపడ్డాయి. యాజమాన్యాలు తీవ్రంగా నష్టపోయాయి.
ఇలాంటి పరిస్థితుల్లో కొద్ది రోజుల క్రితం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యాభై శాతం సీటింగ్ కెపాసిటీతో థియేటర్లకు పర్మీషన్లు ఇచ్చాయి. ఇలా గత డిసెంబర్ నుంచి కొన్ని సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. సంక్రాంతి సీజన్లో సైతం ఇలాగే సినిమాలు ప్రదర్శితం అయ్యాయి. అయితే, ఇప్పుడు కరోనా వైరస్ ప్రభావం తగ్గడానికి తోడు వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరందుకోవడంతో ఈ నిర్ణయంలో మార్పులు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావించింది. ఇందులో భాగంగానే థియేటర్లు సీటింగ్ కెపాసిటీ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.
ఫిబ్రవరి 1 నుంచి థియేటర్లను పూర్తి స్థాయిలో అంటే 100 శాతం సీటింగ్ కెపాసిటీతో నడిపేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు, థియేటర్ యాజమాన్యాలు పాటించాల్సి స్టాండర్డ్ ఆపరేషన్ ప్రోటోకాల్స్ను కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీని ప్రకారం.. ప్రతి సినిమా హాల్, మల్టిఫ్లెక్స్ల్లో హ్యాండ్ శానిటైజర్లు వాడాలని సూచించింది. అంతేకాదు, థియేటర్లలో ఉమ్మి వేయడాన్ని నిషేదించింది. మరీ ముఖ్యంగా సినిమా చూసేందుకు వచ్చే వాళ్లంతా థర్మల్ స్క్రీనింగ్ చేసుకోవడంతో పాటు ఆరోగ్య సేతు యాప్ను వాడాలని చెప్పింది కేంద్ర ప్రభుత్వం. అలాగే, థియేటర్ పరిసర ప్రాంతాల్లో ప్రేక్షకులు దూరం దూరంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది.