Don't Miss!
- Technology ధర రూ.9,999 కే 108MP కెమెరా, 8GB ర్యామ్ స్మార్ట్ఫోన్.. కొనుగోలుపై స్మార్ట్వాచ్ ఉచితం..!
- Finance Swiggy IPO: ఐపీఓగా రానున్న స్విగ్గీ..!
- News ప్రధాని మోదీ, రాహుల్ గాంధీలకు షాక్; కోడ్ ఉల్లంఘనలపై ఈసీ నోటీసులు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రాంచరణ్ రావాల్సిందే.. అప్పటి వరకు ఈ పరిస్థితి ఇంతే..!
Recommended Video
2018 కొత్త సంవత్సరం మొదలై ఒకటిన్నర నెల గడుస్తున్నా టాలీవుడ్ పరిస్థితి మాత్రం మారడం లేదు. ఇప్పటికే అదే తరహా లీస్ట్ సక్సెస్ రేట్ తో నిర్మాతలు బండి లాగిస్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతి సీజన్లో బడా చిత్రాలతో బాక్స్ ఆఫీస్ సందడి మొదలైంది. ఆ తరువాత అక్కడక్కడా కొన్ని మెరుపులు మినహా పెద్దగా ఈ చిత్రం ప్రభావం చూపలేదు. ఇటీవల విడుదలైన తొలిప్రేమ చిత్రం మాత్రం ఈ ఏడాది విడుదలైన చిత్రాలలో స్పష్టంగా తన హవా కొనసాగిస్తోంది. మళ్ళీ మార్చి నెలాఖరు వరకు బాక్స్ ఆఫీస్ ఖాళీగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.
మొదలెట్టిన అజ్ఞాతవాసి, జై సింహా
ఈ ఏడాది సంక్రాంతి సీజన్లో ఇద్దరు బడా హీరోల చిత్రాలతో సందడి మొదలైంది. కానీ అజ్ఞాతవాసి చిత్రం మాత్రం అంచనాలని అందుకోలేదు. బాలయ్య జై సింహా చిత్రం మాత్రం నిర్మాతకు లాభాల పంట పండించింది.
అంతగా కనిపించని సందడి
సంక్రాంతి సీజన్ ముగిసాకా బాక్స్ ఆఫీస్ వద్ద సందడి బాగా తగ్గింది. రిపబ్లిక్ డే సందర్భంగా విడుదలైన భాగమతి చిత్రం రాణించింది. ఆ తరువాత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన రవితేజ టచ్ చేసి చూడు చిత్రంతో నిరాశ పరిచాడు.
తొలిప్రేమ మెరుపులు
ఫిబ్రవరి 10 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన వరుణ్ తేజ్ తొలిప్రేమ చిత్రం ఈ ఏడాది ఇప్పటివరకు విడుదలైన చిత్రాలలో బిగ్ హిట్ గా నిలిచింది. యువత ఈ చిత్రానికి బ్రహ్మ రధం పట్టడంతో బాక్స్ ఆఫీస్ సందడిగా మారింది.
విష్ణు..నిఖిల్.. ఇంకా క్లారిటీ లేదు
విష్ణు ఆచారి అమెరికా యాత్రతో, నిఖిల్ కిర్రాక్ పార్టీ చిత్రంతో రెడీగా ఉన్నారు. కానీ ఈ చిత్రాల విడుదల విషయంలో ఇంకా క్లారిటీ రావడం లేదు. త్వరలో విడుదల కావలసి ఉన్న ఓ మోస్తరు అంచనాలు ఉన్న చిత్రాలు ఇవే. ఆచారి అమెరికా యాత్ర చితా పూర్తి వినోదాత్మక చిత్రంగా, కిర్రాక్ పార్టీ యువతని ఆకట్టుకునే చిత్రాలుగా రాబోతున్నాయి.
మార్చి మొత్తం ఖాళీ..కారణం అదేనా
సాధారణంగా మార్చి నెలలో చిత్రాలని విడుదల చేయడానికి నిర్మాతలు అంతగా ఆసక్తి చూపించారు. ఎంతుకంటే సినిమాలని ఆదరించే యువత మొత్తం పరీక్షల హడావిడిలో ఉంటారు కనుక. ఈ సారి కూడా మార్చి నెల వెలవెల బోనుంది. ఒకటి రెండు చిన్న చిత్రాలు మిహానా మార్చిలో మరే సినిమా విడుదలకు సిద్ధంగా లేదు.
అదునుచూసి అడుగుపెట్టబోతున్న రాంచరణ్
యువత పరీక్షల హడావిడి ముగిసాకా వేసవిలో పేలే తొలి బాంబు రంగస్థలం. మార్చి నెలాఖరున అంటే 30 వ తేదీన చరణ్ తన చిత్రంతో బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మందు వేసవి ఏప్రిల్ లో అల్లుఅర్జున్, మహేష్ వంటి బడా హీరోలు బాక్స్ ఆఫిస్ పై దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.