Don't Miss!
- News జగన్కు షాక్..పిఠాపురంలో వైసీపీకి భారీగా రాజీనామాలు
- Technology X ప్లాట్ఫాం ప్రీమియం ఫీచర్లను ఉచితంగా వినియోగించుకోవచ్చు.. వారికి మాత్రమేనని ఎలాన్ మస్క్ ప్రకటన!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Sports రసెల్కు భయపడి ఆ బౌలర్పై వేటు..KKRతో ఆడే RCB తుది జట్టు ఇదే!
- Automobiles సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
రాజమౌళి వింటున్నారా.. అవెంజర్స్ నటుడికి బాహుబలి 3లో చాన్స్ కావాలట!
Recommended Video
పిల్లలు, పెద్దలు ఇలాంటి భేదం లేకుండా ప్రతి ఒక్కరు అవెంజర్స్ చిత్రాలని చూడాలనుకుంటారు. గత ఏడాది అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ చిత్రం విడుదలై అలరించింది. ఈ ఏడాది అవెంజర్స్ ఎండ్ గేమ్ సిద్ధం అవుతోంది. ఈ తరహాలోనే నేడో ఓ కొత్త చిత్రం విడుదలవుతోంది. అదే అవెంజర్స్ కెప్టెన్ మర్వెల్. అవెంజర్స్ చిత్రాల్లో నిక్ ప్యూరీ పాత్రతో ప్రముఖ హాలీవుడ్ నటుడు శ్యామ్యూల్స్ ఎల్ జాక్సన్ విశేష ఆదరణ సొంతం చేసుకున్నాడు. అవెంజర్స్ కెప్టెన్ మర్వెల్ చిత్ర ప్రచారంలో భాగంగా శ్యామ్యూల్ బాహుబలి చిత్రం గురించి చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి.
ఇలాగైతే మా ఆస్తులు అమ్మేసుకోవాలి.. చంద్రబాబుపై మంచు విష్ణు అటాక్!
హాలీవుడ్కు చేరిన క్రేజ్
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి చిత్రం అంతర్జాతీయ ఖ్యాతిని దక్కించుకుంది. హాలీవుడ్ వాళ్ళు సైతం ఈ చిత్రం గురించి చర్చించుకున్నారు. రాజమౌళిని హాలీవుడ్ దర్శకులతో పోలుస్తూ పలువురు ప్రశంసలు కురిపించారు. ఈ చిత్రంలో నటించిన ప్రభాస్, రానా, అనుష్కకు కూడా జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. తాజాగా బాహుబలి చిత్రం గురించి అవెంజర్స్ చిత్రంలో కీలక నటుడు శామ్యూల్స్ మాట్లాడడం ఆసక్తిగా మారింది.
బాహుబలి 3
అవెంజర్స్ కెప్టెన్ మార్వెల్ చిత్ర ప్రచారం కోసం శ్యామ్యూల్ సింగపూర్ లో ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో యాంకర్ ప్రశ్నిస్తూ.. ఇండియాకు వెళ్లే ఆలోచన ఉందా అని అడిగింది. నాకు పని దొరికితే వెళతా అని శ్యామ్యూల్స్ సమాధానం ఇచ్చాడు. బాలీవుడ్ చిత్రాల్లో నటించే ఆలోచన ఉందా అని ప్రశ్నించగా.. ఉంది.. బాహుబలి 3 లో నటించాలనుకుంటున్నా అని టక్కున సమాధానం ఇచ్చాడు. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు బాహుబలి క్రేజ్ ఈ స్థాయిలో ఉందొ అని.
రాజమౌళి వింటున్నారా
శామ్యూల్స్ ప్రశంసలతో నెటిజన్లు వరుసగా కామెంట్స్ పెడుతున్నారు. రాజమౌళి గారు శ్యామ్యూల్ మాటలు వింటున్నారా.. మీరు వెంటనే బాహుబలి 3 గురించి ఆలోచన చేయాలి అని కామెంట్స్ చేస్తున్నారు. బాహుబలి రెండు భాగాలు సంచలన విజయం సాధించాయి. అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ చిత్రంగా బాహుబలి రికార్డులు నెలకొల్పింది. జపాన్ లో కూడా బాహుబలి చిత్రం జయకేతనం ఎగరవేసింది.
మరో భారీ చిత్రం
రాజమౌళి సినిమా సినిమాకు తన స్థాయి పెంచుకుంటూ పోతున్నాడు. బాహుబలి లాంటి చిత్రం తర్వాత రాంచరణ్, ఎన్టీఆర్ హీరోలుగా మరో భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం స్వాతంత్ర పోరాటం నేపథ్యంలో తెరకెక్కుతోంది. 300 కోట్ల బడ్జెట్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.