Don't Miss!
- News ఏప్రిల్ లో అంగారక యోగం: ఈ మూడు రాశుల వారికి ఆర్థిక నష్టాలు, ఊహించని కష్టాలు
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
వందేళ్ళ దేవదాసుకి సినివారం నీరాజనం: ఈవారం సినివారం
బెంగాలీ రచయిత శరత్ చంద్ర చట్టోపాధ్యాయ రచించిన నవల దేవదాసుకు వందేళ్ళు నిండిన సంధర్భంగా సినివారం వేదిక పై దేవదాసు సినిమా ప్రదర్శణ.
దేవదాసు విఫలమో సఫలమో ఇదమిద్దంగా చెప్పలేని ఒక విషాద గాథ, ప్రపంచ ప్రసిద్ద ప్రేమ కథల్లో చోటు సంపాదించిన ఒక అత్యద్బుతమైన రచన. బెంగాలీ భాషలో ఉన్నా, ఇది తెలుగువారికథే అనిపించేలా సహజత్వానికి దగ్గరగా నవలలు రాసిన ప్రముఖుల్లో ఒకరు శరత్చంద్ర ఛటోపాధ్యాయ అనబడే 'శరత్బాబు'. దేవదాసు, పార్వతీ ఈ లోకం లోకి అడుగుపెట్టి ఆ అద్బుత కథ నిజంగా జరిగిందనే అనిపించేలా మనమధ్య ఇంకా జీవించబట్టీ 2 జూలై 2017 నాటికి 100 సంవత్సరాలయ్యింది... ఈ వందో పుట్టిన రోజునాడు ఆ ప్రేమికులకీ, రచనకీ, రచయితకీ ఒక్క కృతఙ్ఞత చెల్లించుకోవటం తప్ప మరేం చేయగలం..? దేవదాసు సినిమా గురించి చెబుతూ ఇలా అన్నారు మామిడి హరికృష్ణ.
మరణకాలాన లలాటం పై ఒక్క అరచేతి స్పర్శని కోరుకున్న దేవదాసూ, ప్రేమకీ, భాధ్యతకీ, కట్టుబాట్లకీ మధ్య తన అస్తిత్వాన్ని నిలుపుకున్న పార్వతికీ, ఈ ఇద్దరితోనూ ఏ సంబంధమూ లేకుందానే వారి ప్రేమలో తన అస్థిత్వాన్నే త్యాగం చేసిన చంద్రముఖికీ ఆఖరున వీళ్ళందరినీ మన గుండెల్లో నిలిపిన శరత్ చంద్రుడికీ మరేమివ్వగలరూ... మళ్ళీ ఒకసారి ఆ మహా ప్రేమగాథని మననం చేసుకోవటం, శరత్ చంద్రునికో నమస్కారం చేసుకోవటం తప్ప... సినీవారం వేదిక అదే చేసింది. ఆ ప్రేమకథని మళ్ళీ ఒకసారి కళ్ళముందు నిలుపుకుంది...
తెలంగాణా భాషా సాంస్కృతిక శాఖ నిర్వహించే సినివారం కార్యక్రమంలో ఈ వారం (2జూలై 2017) న బెంగాలీ రచయిత శరత్ చంద్ర చట్టోపాధ్యాయ రచించిన నవల దేవదాసుకు వందేళ్ళు నిండిన సంధర్భంగా, అదే రోజున తెలంగాణా సీనియర్ నటుడూ, రచయితా, దర్శకుడూ ఎం.ప్రభాకర రెడ్డి జయంతి సందర్భంగా. ఆ ఇద్దరు మహానుభావులకీ నివాళులు అర్పించిన అనంతరం మామిడి హరికృష్ణ. దేవదాసు నవలమీద, ఆ సినిమా మీదా ప్రసంగించారు. ఈ కార్యక్రమం లో భాషా సాంస్కృతిక శాఖా సంచాలకులు మామిడి హరికృష్ణ గారితో పాటు, అతిథిగా వచ్చిన రాజేంద్ర ప్రసాద్ యలవర్థి, సినివారం గ్రూప్ అక్షరా కుమార్, హుమాయూన్ సంఘీర్, ఎం ఎస్ విష్ణు, శివకట్టా, మహేష్ బాబు పాల్గొన్నారు...