twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అసలైన తోడుదోంగలు

    By Staff
    |

    తెలుగు సినీ కళామతల్లికి రెండు కళ్లు ఎవరు? అని అడిగితే? టక్కున వచ్చే సమాధానం ఎన్టీఆర్, ఏఎన్నార్. ప్రజాభిమానాన్ని చూరగొనడంలో వీరిద్దరూ అగ్రగణ్యులే. వృత్తి పరంగా భయకరమైన పోటీవున్నా..వ్యక్తిగతంగా ఎన్టీఆర్, ఏఎన్నార్ మంచి స్నేహితులు. ఇప్పుడు చెప్పుకోబోయే అంశం వీరిలోని స్నేహభావానికి అద్దం పట్టేలా ఉంటుంది. విషయంలోకెళితే ఎన్టీఆర్ తన సొంత నిర్మాణ సంస్థ 'ఎన్.ఎ.టి."లో ద్వితీయ ప్రయత్నంగా 'తోడుదొంగలు" చిత్రాన్ని నిర్మించారు. అందులో తోడుదొంగలుగా ఎన్టీఆర్, గుమ్మడి నటించారు. యోగానంద్ ఈ చిత్రానికి దర్శకుడు.

    1954 లో విడుదలైన ఈ సినిమా ఆశించినంత విజయాన్ని అందుకోలేకపోయినా అదే సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ అవార్డుల్లో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఎంపికైంది. ఈ సందర్భంగా మిత్రుడు అక్కినేని నాగేశ్వరరావుకు 'తోడుదొంగలు" చిత్రాన్ని చూపించాలని ఎన్టీఆర్ నిర్ణయించుకున్నారు. అక్కినేని కోసం ఎన్టీఆర్ 'తోడుదొంగలు" స్పెషల్ షో వేశారు. సినిమా అయ్యాక ఎన్టీఆర్, గుమ్మడిని వాహినీ ష్టూడియోలోని మేకప్ రూమ్ లో కలిశారు అక్కినేని. 'ఏం బ్రదర్ మా సినిమాపై మీ అభిప్రాయం ఏమిటి?" అని ఎంతో ఉత్సుకతతో అడిగారు ఎన్టీఆర్. దానికి అక్కినేని 'బాగానే ఉందికానీ గుమ్మడి గారే రాంగ్ కాస్టింగ్" అన్నారట.

    తన ఎదురుగానే అక్కినేని అలా అనడంతో గుమ్మడి ముఖం చిన్నబోయింది. వెంటనే ఎన్టీఆర్ 'అదేంటి బ్రదర్...గుమ్మడి గారు బాగానే చేశారుగా..? అంటే, 'బాగానే చేశాడు కానీ.. సిని పరిశ్రమలో 'తోడుదొంగలు" అంటే మనిద్దరం కదా బ్రదర్" మనిద్దరం చేసుంటే ఇంకా రంజుగా ఉండేది అన్నారట అక్కినేని. అంతే...ఎన్టీఆర్ తో పాటు అక్కడున్న వారందరూ నవ్వుల పర్యంతం అయ్యారు. ఈ విషయాన్ని గుమ్మడి ఓ సందర్భంలో గుర్తు చేసుకున్నారు. తన జీవితంలో ఎన్నటికీ మరచిపోలేని సంఘటనగా దాన్ని చెబుతుంటారాయన.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X