Don't Miss!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Automobiles భారత్లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- News ఇంటర్ కళాశాలకు వేసవి సెలవులు...ఎప్పటినుంచంటే..?
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Sports SRH Playing XI: ఆ బౌలర్పై వేటు.. గుజరాత్తో తలపడే సన్రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు ఇదే!
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
సుశాంత్ కేసులో కొత్త ట్విస్టు.. డ్రగ్స్ రాకెట్లో టాలీవుడ్ నటి.. తొలిప్రేమ హీరోయిన్కు సమన్లు
బాలీవుడ్తోపాటు టాలీవుడ్ చిత్రాల్లో నటించిన హీరోయిన్ స్వప్న పబ్బికి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు సమన్లు జారీ చేశారు. బాలీవుడ్ డ్రగ్స్ రాకెట్ కేసును దర్యాప్తు చేస్తున్న అధికారులు తాజాగా స్వప్న పబ్బికి నోటీసులు జారీ చేశారు. దాంతో ఆమె అజాతంలోకి వెళ్లిపోవడంతో అనేక రూమర్లు ఊహగానాలు బయటకు వచ్చాయి. అయితే స్వప్న పబ్బి కోసం గాలిస్తున్నారనే ఆరోపణల మధ్య ఆమె స్పందిస్తూ..
డ్రగ్స్ రాకెట్ కేసులో టాలీవుడ్ హీరోయిన్
సుశాంత్ సింగ్ మరణం కేసుతో ముడిపడి ఉన్న డ్రగ్స్ రాకెట్ కేసులో టాలీవుడ్ హీరోయిన్ పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది. ఈ కేసులో నోటీసులు అందుకొన్న స్వప్న పబ్బి అధికారులకు అందుబాటులో లేకుండా, మీడియాకు కనిపించకుండా పోయారు. దాంతో ఆమె చుట్టూ మీడియాలో వివాదం నెలకొన్నది.
తొలి ప్రేమ చిత్రంలో సునయనగా
అయితే స్వప్న పబ్బి విషయానికి వస్తే.. వరుణ్ తేజ్ హీరోగా నటించిన తొలి ప్రేమ సినిమాలో సునయన పాత్రలో స్వప్న పబ్బి కనిపించారు. సునయన.. సునయన అనే పాటలో కూడా వరుణ్ తేజ్తో కలిసి స్టెప్పులు వేసారు. ఆ తర్వాత సుశాంత్ సింగ్ రాజ్పుత్తో కలిసి డ్రైవ్ అనే చిత్రంలో నటించారు. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు కరణ్ జోహర్ సొంత బ్యానర్ ధర్మ ప్రొడక్షన్పై నిర్మించారు. తను మనుసుఖాని దర్శకత్వం వహించారు. ఇక డ్రగ్స్ రాకెట్ కేసులో ధర్మ ప్రొడక్షన్స్ మాజీ ఉద్యోగిని కూడా డ్రగ్స్ రాకెట్లో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
స్వప్న పబ్బికి నోటీసులు జారీ చేశాం
హీరోయిన్ స్వప్న పబ్బి అందుబాటులో లేకుండా పోవడంపై ఎన్సీబీ అధికారులు స్పందించారు. స్వప్న పబ్బికి డ్రగ్స్ రాకెట్ కేసులో నోటీసులు జారీ చేశాం. అందుబాటులో లేకపోవడంతో ఆమె నివాసంలోని డోర్కు నోటీసులను అంటించాం. అయినా ఆమె అందుబాటులోకి రాలేదు. నోటీసులకు స్పందించలేదు అని ఎన్సీబీ అధికారులు పేర్కొన్నారు.
అజ్ఞాతంలోకి వెళ్లినట్టు వచ్చిన వార్తలపై
అయితే తనపై మీడియాలో వస్తున్న కథనాలపై స్వప్న పబ్బి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా స్పందించారు. నేను అజ్ఞాతంలోకి వెళ్లానని వస్తున్న వార్తలు చూసి విచారంలో మునిగిపోయాను. వాస్తవానికి నేను లండన్లో నా ఫ్యామిలీతో కలిసి ఉన్నాను. నా తరుఫున తన లాయర్లు అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. నా గురించిన సమాచారం వారికి తెలుసు. సమాచారం తెలుసుకోకుండా ఊహాగానాలతో కూడిన వార్తలు రావడం బాధ కలిగింది అని స్వప్న పబ్బి తెలిపారు.
అర్జున్ రాంపాల్ ప్రేయసి సోదరుడి అరెస్ట్తో
ఇదిలా ఉండగా, ఇటీవల అరెస్ట్ అయిన అర్జున్ రాంపాల్కు సన్నిహితుడు ఏజిసిలోస్ డెమిట్రియాడెస్ విచారిస్తున్న సందర్భంగా స్వప్న పబ్బా పేరు వెలుగు చూసింది. ఏజిసిలోస్ డెమిట్రియాడెస్ విచారణ అనంతరం ఆమెకు ఎన్సీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఏజిసిలోస్ డెమిట్రియాడెస్ విషయానికి వస్తే.. అర్జున్ రాంపాల్ ప్రేయసి గ్యాబ్రిల్లాకు సోదరుడు. ఈయనను డ్రగ్స్ కేసులో ఎన్సీబీ అరెస్ట్ చేసింది.