twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ ఎఫెక్ట్ రామ్ చరణ్ చిత్రం పై పడుతుందా?

    By Staff
    |

    Karz-Three
    ఒక సినిమా ఫెయిల్ అయితే ఆ సినిమాను రీమేక్ చేస్తున్నారు...గానీ,కథను కాపీ చేస్తున్నవారు గానీ,డబ్బింగ్ చేస్తున్నవారిపై కూడా పడుతూండటం అందరూ ఎరిగిందే. మొన్న శుక్రవారం పునర్జన్మ సబ్జెక్టుతో వచ్చిన త్రి,హిందీ కర్జ్ రెండూ ఒకే రోజు రిలీజై భాక్సాఫీస్ వద్ద భారీ ఫ్లాఫ్ లను నమోదు చేసాయి. టెక్నికల్ గా త్రి బాగా తీసాడని పేరు తెచ్చుకున్నా ,పాటలు పరంగా కర్జ్ బాగుందన్నా ఇంకా రోజుల్లో పునర్జన్మ కథేంటి అంటూ ప్రేక్షకులు ఛీ కొట్టారు. దాంతో తాజాగా రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ తేజ హీరోగా వస్తున్న పునర్జన్మ సబ్జెక్టు ఎంతవరకూ వర్కవుట్ అవుతుందంటూ కొంతమంది సందేహ జీవులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

    అయితే కథ లేకుండానే కథనంతోనే రాజమౌళి గతంలో ఎన్నో హిట్స్ ఇచ్చాడనీ కొందరు వాదిస్తున్నారు. అందులోనూ అతని ప్రతీ సినిమానూ కమర్షియల్ గా నిలబెట్టేందుకు ఏదో ఒక ట్రిక్ ప్లే చేస్తాడనీ ఈ సారీ అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందని మరికొంతమందంటున్నారు. అయినా ఇవాళ ఈ రెండు సినిమాలు ఫ్లాఫ్ అయ్యాయి గానీ లాస్ట్ దీపావళి కి పునర్జన్మ కాన్సెప్ట్ తో వచ్చిన ఓం శాంతి ఓం సూపర్ హిట్ కాదా అని రెట్టిస్తున్నారు.

    ఏమో లాస్ట్ ఇయర్ కీ ఇప్పటికీ ప్రేక్షకులలో మార్పు వచ్చిందేమో అందుకే ఫ్లాఫ్ అయ్యాయోమో అని మరొకరు అంటే అంత త్వరగా మారేవారు కాదులే మనవాళ్ళు అని ఓ ఫిల్మ్ నగర్ వాసి వారి సందేహాన్ని తీర్చాడు. అయినా రాజమౌళి,రామ్ చరణ్ సినిమా కాంబినేషన్ అంటే మినిమం గ్యారెంటీ అని అందరికీ నమ్మకం కాబట్టి ఓపినింగ్స్ కి లోటుండదు. కొంచెం బాగున్నా వరస కలెక్షన్స్ కీ ఇబ్బంది ఉండదు..కాబట్టి ఈ ఎఫెక్ట్ పడే అవకాశం ఉండే అవకాశం ఉండదు....ఏమంటారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X