వేసవిసెలవుల్లో హీరోలకు పరీక్షలు
ఆల్ఫూల్స్డేతో ప్రారంభమయ్యే ఏప్రిల్ నెలనాగార్జున, వెంకటేష్,ఎన్టీఆర్,మహేష్బాబు, ప్రభాస్, తరుణ్లరేటింగ్స్ను నిర్ణయించనుంది. వేసవిసెలవుల్లో విడుదలవుతున్న ఈ సినిమాలుఏమాత్రం బాగున్నా హిట్ అవడం ఖాయం. శరవేగంగా నిర్మాణంలో ఉన్నమహేష్బాబు అతడు ఏప్రిల్లోఖచ్చితంగా విడుదల కానుంది. మహేష్పెళ్ళి కారణంగా ఈ సినిమా కొంచెంఆలస్యమైంది. త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వంవహిస్తున్న ఈ సినిమాలోత్రిష హీరోయిన్.మహేష్ గత రెండుచిత్రాలు నాని అర్జున్ అంతంత మాత్రంగాఆడాయి.
వరుసఫ్లాప్లు వచ్చినా కుంగిపోకుండా జూనియర్ ఎన్టీఆర్ బి.గోపాల్దర్శకత్వంలోకష్టపడి నటిస్తున్న సినిమా కూడాఏప్రిల్లో విడుదల కానుంది. కొన్ని పాటలు మినహాసినిమా షూటింగ్ పార్ట్ పూర్తయింది. బాలీవుడ్భామలు అమీషా పటేల్,సమీరారెడ్డి హీరోయిన్లు. భారీసెట్టింగ్లతో తీసిన వెంకటేష్సుభాష్ చంద్ర బోస్, నాగార్జునవాడు నేను కూడా ఏప్రిల్లోవిడుదలయ్యే అవకాశముంది. పూరిజగన్నాద్ దర్శకత్వంలో అన్నపూర్ణస్టూడియోస్ బ్యానర్ కింద నిర్మాణంలోఉన్న వాడు నేను సినిమాపై భారీఅంచనాలున్నాయి. నాగార్జున సినిమాలువరుస విజయాలు పొందుతున్నాయి.ప్రభాస్ హీరోగా చక్రం ఈ సినిమాలన్నిటికంటే ముందు విడుదల కానుంది. ఆర్ధికకారణాల వల్ల బాగా ఆలస్యమైన ఈ సినిమాకుదర్శకుడు కృష్ణ వంశీ.తరుణ్ హీరోగా రామానాయుడు నిర్మించిన సోగ్గాడుకూడా అదే సమయంలో విడుదల కానుంది. దాదాపుముప్పై ఏళ్ళ క్రితం రామానాయుడుశోభన్బాబు హీరోగా నిర్మించిన సోగ్గాడుసినిమా కనకవర్షం కురిపించింది.కొత్త సోగ్గాడులో వెంకటేష్, శ్రీయ, సుమంత్,శ్రీకాంత్లు అతిధి పాత్రల్లో కన్పించి ప్రేక్షకులనుఆనందపరచబోతున్నారని వినికిడి.వేసవి సెలవుల్లో విడుదల కానున్న సినిమాల వ్యాపారంవాల్యూమ్ వందకోట్లకుపైగా ఉంటుందని అంచనా. విద్యార్ధులకుపరీక్షలు ముగిసిన తర్వాత హీరోలకుపరీక్షలు జరబోతున్నాయన్నమాట.


Click it and Unblock the Notifications











