అందరివాడుఖరారు,సెప్టెంబర్లో కొత్త సినిమా
గీతా ఆర్ట్స్బ్యానర్ కింద చిరంజీవి ద్విపాత్రాభినయచిత్రానికి అందరివాడు టైటిల్ఖరారైంది. దట్స్ తెలుగు డాట్ కామ్ నిర్వహించినఒపీనియన్ పోల్లో కూడాఅందరి వాడు టైటిల్ను అత్యధికసంఖ్యలో పాఠకులు ఎంపిక చేశారు. ఈ సినిమాకు సంబంధించినయాక్షన్ సన్నివేశాలను లింగంపల్లి రైల్వేస్టేషన్లో చిత్రీకరించారు. ప్రస్తుతంక్లెయిమాక్స్ సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరిస్తున్నారు. అక్కడగుమికూడినచిన్న పిల్లలు మెగాస్టార్ అందరివాడు అనినినాదాలు చేయడంతో చిరంజీవి వారిని చేతులుఊపి విష్ చేశారు. ఆ సందర్భంగానిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూజనం మెచ్చిన అందరివాడు టైటిల్నేఖరారు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సినిమాకుదర్శకుడు శ్రీను వైట్ల. ఈ సినిమా మే చివరి వారంలో గానీ జూన్మొదటివారంలో గానీ విడుదల కానుంది.
చిరంజీవిరెండో సినిమా జై చిరంజీవ చిత్రంరెగ్యులర్ షూటింగ్ అమెరికాలో మే మూడోవారంలో ప్రారంభం కానుంది. ఈ సినిమానుసి. అశ్వనీదత్ నిర్మిస్తున్నారు.ఆ తర్వాత అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్నిర్మించే చిరంజీవి చిత్రం సెప్టెంబర్లో ప్రారంభమవుతుంది.


Click it and Unblock the Notifications











