జై చిరంజీవకు రెండురోజులు బ్రేక్!
హోంపేజి సినిమా టిడ్బిట్స్
చిరంజీవినటిస్తున్న వైజయంతీ మూవీస్ చిత్రంజై చిరంజీవ డిసెంబర్ 14న కానీవిడుదల కానుంది. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లోజరుగుతోంది. ఇటీవల థమ్స్అప్ కొత్తయాడ్లో కృష్ణవంశీ దర్శకత్వంలో చిరంజీవినటించినందువల్ల జై చిరంజీవ షూటింగ్కు రెండు రోజులపాటుఅంతరాయం ఏర్పడింది. ఈ సినిమాలో నవరసాలు ఉంటాయని,చిరంజీవి అభిమానులకు కావలసిన మసాలా అంతాఉంటుందని నిర్మాత అశ్వనీదత్ చెబుతున్నారు.అయితే సినిమా కథ ఎలాఉంటుందో చెప్పకుండా గోప్యంగాఉంచుతున్నారు. మన్మధుడుమల్లీశ్వరి వంటి హిట్ చిత్రాలు తీసినవిజయభాస్కర్ ఈ సినిమాకు దర్శకత్వంవహిస్తున్నారు. విజయభాస్కర్కు ఇంతవరకు ఒక్క ఫ్లాప్ కూడా లేకపోవడంవిశేషం. చిరంజీవి సరసన సమీరారెడ్డి,భూమిక నటిస్తున్నారు. సంగీతంమణిశర్మ. కెమెరా వేణుగోపాల్.


Click it and Unblock the Notifications











