నాగబాబు నిర్మాతగా చిరంజీవి మరో చిత్రం
హోంపేజి సినిమా టిడ్బిట్స్
జై చిరంజీవ తర్వాత చిరంజీవి నటించే రెండు చిత్రాలకు ఆయన తమ్ముడు నాగేంద్రబాబు నిర్మాతగా ఉండబోతున్నారు. జై చిరంజీవ తర్వాత చిరంజీవి మురుగదాస్ దర్శకత్వంలో ఒక చిత్రంలో నటించనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను నాగేంద్రబాబు అంజనా ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించనున్నారు. టాగూర్ సినిమా నిర్మాత మధు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తారు. ఈ సినిమాకు స్టాలిన్ అని పేరు పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రం తర్వాత చిరంజీవి నటించే సినిమాను అల్లు అరవింద్, నాగేంద్రబాబు సంయుక్తంగా నిర్మించనున్నారు. దీనికి సంబంధించిన కథా చర్చలు ప్రస్తుతం జరుగుతున్నాయి.


Click it and Unblock the Notifications











