Don't Miss!
- News ఏపీలో మోడీ ప్రచారం ఖరారు-4 బహిరంగ సభలకు ప్లాన్..!
- Sports PBKS vs MI: అందుకే రెండు మార్పులు చేశాం: సామ్ కరణ్
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
Home
ఇవివి సత్యనారాయణ తనయుడు అల్లరి నరేశ్ ఖాళీ లేకుండా షూటింగ్స్లో పాల్గొంటూ సినిమా మీద సినిమా చేసేస్తున్నారు. నరేశ్కి హిట్ ఇవ్వాలని సంకల్పించి దర్శకడు ఇవివి కితకితలు రూపొందించి ఫర్వాలేదనిపించారు. ఆ తర్వాత నరేశ్కు వద్దంటే ఆఫర్లు వచ్చి పడుతున్నాయి.
జనార్దన మహర్షి దర్శకుడిగా మారి రూపొందిస్తున్న - గోపి (గోడ మీద పిల్లి) - చిత్రంలో నరేశ్ జగపతిబాబుతో కలిసి నటిస్తున్నారు. తర్వాత బజ్జూ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్న తొలి చిత్రం - అల్లరే అల్లరి - చిత్రంలో వేణుతో కలిసి నరేశ్ నటిస్తున్నారు.
ఇది కాక, నరేశ్ సోలో హీరోగా గతంలో ప్రారంభమైన - సీమశాస్త్రి (బీభత్సమైన ఫ్యాక్షనిస్టు) - చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రం షూటింగ్ విశేషాలను ఇటీవల విలేఖరులకు వివరించారు. ఒక సంప్రదాయ కుటుంబంలో పుట్టి ఫ్యాక్షనిస్టు కుటుంబంలో అమ్మాయిని ప్రేమించిన సీమ శాస్త్రి తన ప్రేమను దక్కించుకోడానికి ఎలా మారాడన్న ఇతివృత్తంతో ఈ చిత్రం రూపొందుతోంది. నరేశ్ సరసన ఫర్జానా నటిస్తోంది. ప్రస్తుతం చివరి షెడ్యూల్ జరుపుకొంటున్న ఈ చిత్రం ఆడియో త్వరలోనే విడుదలవుతుందని నిర్మాతలు తెలిపారు.
నరేశ్ నటించిన ఈ మూడు చిత్రాలు ఇంచుమించు ఏకకాలంలో వరుసగా విడుదలకు సిద్ధమవుతుండటం విశేషం.