Tiger Nageshwar టైగర్ నాగేశ్వరరావుపై భారీగా కత్తెర.. ఆ సీన్లను ఓ రేంజ్లో లేపేశారట!
స్టూవర్ట్పురంలో పేరు మోసిన దొంగ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా తెరకెక్కిన టైగర్ నాగేశ్వరరావు సినిమా రిలీజ్ తర్వాత మిక్స్డ్ టాక్ను సొంతం చేసుకొన్నది. ప్రముఖ నిర్మాత అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ సినిమాకు వంశీ దర్శకత్వం వహించారు. మాస్ మహారాజ్ రవితేజ, నూపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్, అనుపమ్ ఖేర్, మురళీశర్మ, రేణుదేశాయ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా కొన్ని విషయాల్లో వ్యక్తమైన తీవ్ర అభ్యంతరాల వివరాల్లోకి వెళితే..
మాస్ మహారాజ్ రవితేజ టైగర్ నాగేశ్వరరావు పాత్రకు పూర్తిగా న్యాయం చేశాడు. కానీ కథ, కథనాల్లో స్క్రిప్టు పరంగా కొన్ని లోపాలు ఉన్నాయనే అభిప్రాయం తొలి ఆట తర్వాత వ్యక్తమైంది. ఈ సినిమాకు ప్రధానంగా నిడివి నెగిటివ్గా మారింది. ఈ సినిమా నిడివిని 164 నిమిషాలకుపైగా పెంచారు. దాంతో సినిమాలో ఉండే ఫీల్ గుడ్ అంశాలను ఎలివేట్ చేయకుండా అడ్డుకొన్నదనే అభిప్రాయం వ్కక్తమైంది.

టైగర్ నాగేశ్వరరావు సినిమా సెకండాఫ్లో రిపీట్ సీన్లు వేయడం ప్రేక్షకుల సహనానికి పరీక్షలా అనిపించింది. దాంతో ఈ సినిమాకు నిడివి తగ్గించి ఉంటే బెటర్ అవుట్పుట్, ఫీల్ ఉండేదనే అభిప్రాయాలను చిత్ర యూనిట్ పరిగణనలోకి తీసుకొన్నది. దాంతో ఈ సినిమా నిడివిపై కత్తెర వేసింది.
టైగర్ నాగేశ్వరరావు రిలీజ్ తర్వాత రెండో రోజు నిడివిని తగ్గిస్తూ చిత్ర యూనిట్ నిర్ణయం తీసుకొన్నది. 182 నిమిషాల నిడివి నుంచి కొంత తగ్గించింది. 157 నిమిషాలకు తగ్గించింది. మొత్తంగా ఈ సినిమాలోని 25 నిమిషాల కంటెంట్ను తొలగించారు. దాంతో ఈ సినిమా నిడివి ప్రస్తుతం 2.37 గంటలుగా నిర్ణయించారు. నిడివి తగ్గించిన తర్వాత సినిమాలో ఫీల్ పెరుగుతందా? ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.

టైగర్ నాగేశ్వరరావు సినిమా తొలి రెండు రోజుల్లో ఓ మోస్తారు కలెక్షన్లు సాధించింది. తొలి రోజు 9 కోట్లకుపైగా, రెండో రోజు 8 కోట్ల రూపాయలు వసూలు చేసింది. మొత్తంగా 17 కోట్ల రూపాయలను ఈ సినిమా వసూలు చేసింది. రానున్న రోజుల్లో ఏ రేంజ్లో కలెక్షన్లు సాధిస్తుందో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











