Don't Miss!
- News సుమలత దెబ్బకు మాజీ సీఎం హడల్, ఇంతవరకు ప్రచారం చెయ్యలేదు, అసలు మ్యాటర్ !
- Sports IPL 2024: చరిత్ర సృష్టించిన సన్రైజర్స్ హైదరాబాద్!
- Technology Whatsapp File Sharing Feature వాట్సాప్లో కొత్త ఫీచర్.. సులభంగా ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు..!
- Lifestyle మీ భార్యతో ఇలా ఎప్పుడైనా ఉన్నారా..? ఆ విషయంలో భర్త తగ్గాల్సిందే..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
రామ్ చరణ్ కీ, ఎన్టీఆర్ కి మధ్య ఆ డైరక్టర్ చిచ్చు పెట్టినట్లేనా?
రామ్ చరణ్ తో తాజాగా చిత్రం ఓకే చేయించుకున్న దర్శకుడు సంపత్ నంది. అతను తన చిత్రానికి రచ్చ అనే టైటిల్ ఫిక్సయ్యారు. అయితే ఆ టైటిల్ ని ఎన్టీఆర్,సురేంద్రరెడ్డి కాంబినేషన్ లో రూపొందే చిత్రానికి పెట్టాలని ఫిక్సయ్యారు. అయితే దీనిపై వెంటనే సంపత్ నంది స్పందించి తనకు అన్యాయం జరిగిపోతోందంటూ మీడియాకు ఎక్కారు. అయితే అప్పటికి ఆ టైటిల్ తో ఓ కథను రవితేజకు చెప్పానని ఆయన ప్రకటించారు. అయితే మారిన పరిస్ధితుల దృష్ట్యా ఆ టైటిల్ తో రామ్ చరణ్ తో చిత్రం ఓకే చేయించుకున్నాడు.
ఇప్పుడు రామ్ చరణ్ సైతం ఆ టైటిల్ తోనే చిత్రం చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ కూడా తన బృందావనం చిత్రంలో డైలాగుని అనుసరించి తన చిత్రానికి రచ్చ అనే టైటిల్ ని అనుకున్నానంటూ చెప్తున్నారు. ఈ నేఫధ్యంలో టైటిల్ వివాదం ఈ ఇద్దరు హీరోల మధ్య నెలకొంది. మెగా అభిమానులు,నందమూరి అభిమానలుకు ఇది ప్రెస్టేజ్ ఇష్యూగా మారింది. దీంతో ఈ టైటిల్ ఈ ఇద్దరు హీరోల్లో ఎవరిని వరిస్తోందో..లేక పోతే మరొకరు దానిని చేజిక్కుంచుకుని కళ్యాణ్ రామ్ కత్తిలా..ఫలానా రచ్చ అని పెట్టి ఇద్దరకి ట్విస్ట్ ఇస్తారో వేచి చూడాలి.