టైటిల్ ఇంకా నిర్ణయించలేదు...మీ ప్రచారం ఆపండి

నిర్మాత మాట్లాడుతూ... ''మా సినిమా పేరు విషయంలో కొన్ని అసత్య ప్రచారాలు జరుగుతున్నాయి. ఇంకా ఏ పేరూ నిర్ణయించలేదు. త్వరలో ప్రకటిస్తాము''అన్నారు.ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతోంది. లియో ప్రొడక్షన్స్ పతాకంపై సినిమా రూపొందబోతోంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం అందిస్తున్న దీనికి ఠాగూర్ మధు, నల్లమలుపు బుజ్జి నిర్మాతలు. గోదావరి అందాల నడుమ సాగే చక్కటి ప్రేమకథగా సినిమా ఉండబోతోందని చిత్రవర్గాలు చెబుతున్నాయి. 'కొత్తబంగారులోకం',' సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రాలతో తనదైన ముద్ర తెలుగు తెరపై వేసి ఆకట్టుకొన్నాడు శ్రీకాంత్ అడ్డాల. ఇప్పుడు వరుణ్తేజ్తో తొలి అడుగులు వేయించేందుకు సిద్ధమవుతున్నాడు.
అలాగే...గోదావరి అందాలు.. తెలుగు కుటుంబాల అనుబంధాల నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రమిది. వరుణ్, పూజల జంట ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. 35 రోజుల పాటు కోనసీమలో తెరకెక్కించిన సన్నివేశాలు చిత్రానికి ఆకర్షణగా నిలుస్తాయి. ఈ నెలాఖరుకు టాకీ చిత్రీకరణ పూర్తవుతుంది. మిగిలిన మూడు పాటలను వచ్చే నెలలో చిత్రీకరిస్తాం అని తెలియచేసారు.
నాగబాబు కుమారుడు వరుణ్తేజ్నుహీరోగా పరిచయం చేస్తూ ఈ చిత్రం తెరకెక్కుతోంది. పూజా హెగ్డే హీరోయిన్. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) నిర్మాత. ఠాగూర్ మధు సమర్పకులు. చిత్రంలో ప్రకాష్రాజ్, బ్రహ్మానందం, రావు రమేష్, నాజర్ ఇతర పాత్రధారులు. చిత్రానికి సంగీతం: మిక్కీ జె.మేయర్,ఛాయాగ్రహణం: మణికందన్


Click it and Unblock the Notifications











