Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
శ్రీలంక పేలుళ్లు.. శివాజీ రాజా ఎలా తప్పించుకున్నారంటే.. క్లోజ్ ఫ్రెండ్కు గాయాలు!
ఏప్రిల్ 21 ఆదివారం రోజు శ్రీలంకలో ఉగ్రవాదులు పెను విధ్వంసం సృష్టించారు. హోటల్స్, చర్చిలు టార్గెట్ గా వరుస బాంబ్ బ్లాస్టులు చేశారు. ఈ ఘటనలో దాదాపు 200 మంది ప్రజలు మరణించిన సంగతి తెలిసిందే. ఈ మారణ హోమంలో కొంతమంది భారతీయులు కూడా మరణించారు. సినీనటి రాధికా తాను ఈ ఘటన నుంచి తృటిలో తప్పించుకున్నానని సోషల్ మీడియాలో తెలిపిన సంగతి తెలిసిందే. తాజాగా టాలీవుడ్ నటుడు శివాజీ రాజా శ్రీలంక బాంబు పేలుళ్ల గురించి స్పందించారు. తన క్లోజ్ ఫ్రెండ్ ఈ ఘటనలో స్వల్పంగా గాయపడ్డాడని, తన స్నేహితుడి బంధువు మరొకరు మరణించారని శివాజీ రాజా తెలిపారు.
చివరి నిమిషంలో ఆగిపోయా
శివాజీ రాజా కూడా శ్రీలంక బాంబు పేలుళ్ల నుంచి తప్పించుకున్నారు. కొన్ని రోజుల క్రితం తనతో పాటు స్నేహితులమంతా శ్రీలంక టూర్ ప్లాన్ చేసుకున్నాం అని శివాజీ రాజా తెలిపారు. శ్రీలంకకు వెళ్లడం దాదాపుగా ఖాయం అనుకుంటున్న తరుణంలో తన కుటుంబంలో ఓ శుభకార్యానికి పాల్గొనాల్సి వచ్చింది. దీనితో తన పర్యటనని రద్దు చేసుకున్నానని శివాజీ రాజా తెలిపారు. మిగిలిన తన స్నేహితులు శ్రీలంకకు వెళ్లినట్లు శివాజీ రాజా తెలిపారు.
క్లోజ్ ఫ్రెండ్కు గాయాలు
శ్రీలంక పేలుళ్లలో తన క్లోజ్ ఫ్రెండ్ శ్రీనివాస్ బాబు అనే వ్యక్తి స్వల్పంగా గాయపడ్డట్లు శివాజీ రాజా తెలిపారు. తాను ప్రస్తుతం బాగానే ఉన్నాడని, రెండు రోజుల్లో తిరిగి వచేస్తాడని అన్నారు. బాధాకర విషయం ఏంటంటే ఈ సంఘటనలో శ్రీనివాస్ బాబు బంధువు తులసి రామ్ మరణించినట్లు శివాజీ రాజా తెలిపారు. తన స్నేహితుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాని శివాజీ రాజా అన్నారు.
ఎప్పుడు వెళ్లినా
పేలుళ్లలో గాజు ముక్కలు గుచ్చుకోవడం వలన శ్రీనివాస్ బాబుకు అక్కడక్కడా గాయాలు అయ్యాయి. స్నేహితులతో కలసి ఎప్పుడు శ్రీలంకకు వెళ్లినా కొలంబోలోని ది షాంగ్రిలా హోటల్ లోనే బస చేస్తాం అని శివాజీ రాజా తెలిపారు. ఈ సారి కూడా తన స్నేహితులు అదే హోటల్ లో దిగారని అన్నారు. ఉగ్రవాదులు ఉగ్రవాదులు ది షాంగ్రిలా, ది సినమన్ గ్రాండ్, ది కింగ్స్ బరి హోటల్స్ తో పాటు కొన్ని చర్చిలపై కూడా బాంబు పేలుళ్లు జరిగిపిన సంగతి తెలిసిందే.
వరుసగా ఫోన్లు
చివరి నిమిషంలో నా ప్రయాణం ఆగిపోయింది. కానీ నేను కూడా శ్రీలంకకు వెళ్లానని అనుకుంటున్న కొందరు స్నేహితులు, సన్నిహితులు రెండు రోజులుగా నాకు ఫోన్ చేస్తున్నారని.. తాను శ్రీలంకకు వెళ్లలేదని చెప్పడంతో ఊపిరి పీల్చుకుంటున్నారని శివాజీ రాజా తెలిపారు. కొన్ని రోజుల క్రితం జరిగిన మా అసోసియేషన్ ఎన్నికల నేపథ్యంలో శివాజీ రాజా వార్తల్లో నిలిచారు.