రాజీపడని వ్యక్తి: బాలకృష్ణ

By Staff

Trivikram Rao
ప్రముఖ నిర్మాత త్రివిక్రమరావు మరణానికి బాలయ్య చాలా ఆవేదనతో స్పందిచారు. ఆయన ఏ విషయంలోనూ రాజీపడని వ్యక్తి అని కొనియాడారు. అంతేగాక.. త్రివిక్రమరావు మరణంతో తెలుగు చిత్రసీమ ఒక గొప్ప నిర్మాతను కోల్పోయిందని అన్నారు. త్రివిక్రమరావు మృతికి సంతాపం తెలిపిన ఆయన "మా నాన్నగారు ఎన్టీ రామారావుతో 'జస్టిస్‌ చౌదరి', నాతో 'రౌడీ ఇన్‌స్పెక్టర్‌', 'బొబ్బిలి సింహం' వంటి హిట్‌ చిత్రాల్ని త్రివిక్రమరావు నిర్మించారు. క్వాలిటీ విషయంలో ఏమాత్రం రాజీపడని నిర్మాత ఆయన. సినిమా బాగా రావడానికి ఖర్చుకు వెరవని ఆయన క్రమశిక్షణ కలిగిన నిర్మాతగా చక్కని ప్రమాణాలు నెలకొల్పారు. ఆయనతో మా కుటుంబానికి ఆత్మీయతానుబంధం వుంది. ఆయన కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా'' అని చెప్పారు.

ఇక మరో నటుడు,ప్రజా రాజ్యం అధినేత చిరంజీవి కూడా సంతాపం వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..త్రివిక్రమరావుగారు నాతో మూడు చిత్రాలు నిర్మించారు. స్నేహశీలి. గర్వించదగ్గ నిర్మాత. చిత్రనిర్మాణ రంగంలో రాజీపడని నైజం ఆయనని అగ్రనిర్మాతగా నిలబెట్టింది. ఆయనకు ఆత్మశాంతి చేకూరాలని కోరుకుంటున్నాను అన్నారు. మెగా ప్రొడ్యూసర్ రామానాయుడు మాట్లాడుతూ.. క్రమశిక్షణ కలిగిన నిర్మాతగా, అజాతశత్రువుగా పేరు తెచ్చుకున్న వ్యక్తి త్రివిక్రమరావుగారు అన్నారు. ఇక దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు...ఆయన నాతో రెండు సినిమాలు తీశారు. నిర్మాత, దర్శకుడు అనేదాని కంటే మా ఇద్దరి మధ్య మంచిస్నేహబంధం ఉంది. కుటుంబమిత్రుడయిన త్రివిక్రమరావు మరణం నన్నెంతో బాధించింది అంటూ స్పందించారు. ఇలా టాలీవుడ్ లో చిన్నా పెద్దా తేడాలేకుండా ఆయనకు నివాళులు అర్పించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X