Don't Miss!
- News ఎన్నికల వేళ ధర్మవరం లో నువ్వా -నేనా, సై..!!
- Sports RCB vs KKR: వేరీజ్ మ్యాడ్ మ్యాక్సీ: ఆర్సీబీలో గందరగోళం
- Finance Bank Holidays: ఏప్రిల్ లో 14 రోజులు బ్యాంకులకు సెలవులు..
- Automobiles కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
జెర్సీ, అర్జున్ రెడ్డి దర్శకుల తరువాత బాలీవుడ్లోకి మరో తెలుగు డైరెక్టర్.. బడా హీరోతో పాన్ ఇండియా మూవీ
రానున్న రోజుల్లో సినిమా ఇండస్ట్రీలో చాలా మార్పులు జరుగుతాయి అని చెప్పవచ్చు. ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాలు సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. దర్శకులు కూడా వారి స్థాయిని పెంచుకునే విధంగా అడుగులు వేస్తున్నారు స్టార్ హీరోలు సైతం టాలెంటెడ్ డైరెక్టర్స్ ను భాషా భేదం లేకుండా నమ్ముతున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ హీరోలు తెలుగు సినిమాలపై తెలుగు దర్శకులపై కాస్త ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. జెర్సీ, అర్జున్ రెడ్డి సినిమాలతో మన తెలుగు దర్శకులు స్థాయి ఏ రేంజ్ లో పెరిగిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు ఇక ఇప్పుడు మరో బాలీవుడ్ బడా హీరో తెలుగు దర్శకుడిపై నమ్మకంతో ఉన్నట్లు తెలుస్తోంది.
అర్జున్ రెడ్డి సినిమాతో
విజయ్ దేవరకొండ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ సినిమా తెలుగులో ఒక ట్రెండ్ సెట్ చేసింది అలాగే బాలీవుడ్లో కూడా అంతకుమించి రికార్డులను అందుకుంది. అర్జున్ రెడ్డి రీమేక్ గా వచ్చిన కబీర్ సింగ్ సినిమా తో సందీప్ వంగా పేరు ఒక్కసారిగా మారుమోగిపోయింది. దీంతో బాలీవుడ్లో అతనికి బడా నిర్మాణ సంస్థల నుంచి ఆఫర్స్ వచ్చాయి.
బాలీవుడ్ లోనే మరో సినిమా
ప్రస్తుతం సందీప్ రెడ్డి రన్ భీర్ కపూర్ తో అనిమల్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మొదట ఆ కథను టాలీవుడ్ స్టార్ మహేష్ బాబు కు వినిపించినప్పటికీ ఒప్పుకోలేదని టాక్ వచ్చింది. దీంతో సందీప్ మరోసారి బాలీవుడ్ లోనే తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. ఆ సినిమా తెలుగులో కూడా విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు టాక్ వస్తోంది.
జెర్సీ రీమేక్
నాని హీరోగా తెరకెక్కిన ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా జెర్సీ సినిమా పలు జాతీయ అవార్డులను అందుకోని బాలీవుడ్ హీరోలను ఆకర్షించింది. ఇక అందరి కంటే ముందే మరోసారి షాహిద్ కపూర్ ఆ సినిమా రీమేక్ నటించేందుకు ముందుకు వచ్చాడు. తెలుగులో దర్శకత్వం వహించిన గౌతమ్ తిన్ననూరి హిందీలో కూడా డైరెక్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆ సినిమా అవుట్ పుట్ పై షాహిద్ కపూర్ ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నట్లు అర్థం అవుతోంది. త్వరలోనే హిందీ జెర్సీ మూవీ భారీ స్థాయిలో విడుదల కాబోతోంది.
రమేష్ వర్మ కూడా
సందీప్ రెడ్డి వంగా గౌతమ్ తిన్ననూరి పేర్లు ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. చూస్తుంటే బాలీవుడ్ లోనే మరి కొన్ని ఆఫర్స్ కూడా అందుకునేలా ఉన్నారు. ఇక వారితో పాటు త్వరలోనే మరో తెలుగు దర్శకుడు పేరు కూడా బాలీవుడ్ ఇండస్ట్రీ లో వినిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఆ దర్శకుడు మరెవరో కాదు రాక్షసుడు సినిమాతో బాక్సాఫీస్ హిట్ అందుకున్న రమేష్ వర్మ.
అక్షయ కుమార్ తో న్యూ మూవీ
రమేష్ వర్మ ప్రస్తుతం రవితేజతో ఖిలాడి అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే ఆ సినిమా పనులు దాదాపు పూర్తయ్యాయి. త్వరలోనే రిలీజ్ డేట్ పై కూడా క్లారిటీ ఇవ్వాలి అని అనుకుంటున్నారు. ఇక సినిమా విడుదల కాకముందే సల్మాన్ ఖాన్ టీం రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నట్లు సమాచారం.
ఇక రమేష్ వర్మ తో సినిమా చేయాలని మరో బాలీవుడ్ హీరో సిద్ధంగా ఉన్నట్లు టాక్ వస్తుంది. బాలీవుడ్ టాలెంటెడ్ హీరో అక్షయ్ కుమార్ రీసెంట్ గా రమేష్ వర్మ కలిసినట్లు సమాచారం.
రాక్షసుడు 2 కోసం
రాక్షసుడు 2 కోసం ఈ ఇద్దరు కలిసి వర్క్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టును పాన్ ఇండియా లెవెల్ లో చిత్రీకరించాలని ప్లాన్ చేస్తున్నారు. సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు. రాక్షసుడు సీక్వెల్ లో మొదట తమిళ్ హీరోని సెలెక్ట్ చేసినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అలాగే తెలుగు హీరోలను కూడా సంప్రదించినట్లు కథనాలు వెలువడ్డాయి. ఇక ఎవరూ ఊహించని విధంగా రమేష్ వర్మ ఏకంగా బాలీవుడ్ హీరోలపై ఫోకస్ పెట్టాడు. మొత్తానికి అక్షయ్ కుమార్ తో రాక్షసుడు 2 ప్రాజెక్ట్ ఓకే అయినట్లు టాక్ వస్తోంది.
Recommended Video
ఆ నమ్మకంతోనే గ్రీన్ సిగ్నల్
రమేష్ వర్మ ఇదివరకే రాక్షసుడు సినిమా తో బాక్సాఫీస్ హిట్ అందుకని టాలీవుడ్ స్టార్ హీరోలను ఆకర్షించాడు రవితేజతో ఉన్న సాన్నిహిత్యం ద్వారా ఖిలాడి సినిమాను సెట్ చేసుకున్నాడు. ఖిలాడి సినిమా ఫై ప్రస్తుతం టాలీవుడ్ ప్రేక్షకుల్లో అంచనాలు గట్టిగానే ఉన్నాయి. అయితే గతంలోనే వీరి కాంబినేషన్ లో వీర అనే సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమా అంతగా సక్సెస్ అవ్వలేదు. అయినప్పటికీ రమేష్ వర్మ టాలెంట్ పై రవితేజ నమ్మకంతో సినిమాను ఓకే చేశాడు. ఇక బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కూడా రమేష్ వర్మ పై ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు బాలీవుడ్లో బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాలని అగ్రహీరోలు దర్శకులు తీవ్రస్థాయిలో పోటీ పడుతున్న విషయం తెలిసిందే. పూరి జగన్నాథ్ లైగర్ సినిమా తో పాటు, సుకుమార్ పుష్ప, రాజమౌళి RRR వంటి సినిమాలు బాలీవుడ్ లో భారీ స్థాయిలో విడుదల కానున్నాయి. మరి ఆ సినిమాలతో మన దర్శకులు ఇంకా ఏ స్థాయికి చేరుకుంటారు చూడాలి.