Don't Miss!
- Lifestyle పురుషుల్లో ఈ లక్షణాలు ఉంటే.. ఖచ్చితంగా డిప్రెషన్కు గురైనట్టే..!
- Automobiles కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- News మండుటెండల్లో నారాయణ విద్యాసంస్థల సిబ్బందికి ఎన్నికల కష్టం!!
- Sports T20 వరల్డ్ కప్కు భారత తుదిజట్టు ఇదే - సెహ్వాగ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
మజాగా టాలీవుడ్ మస్తి 2014
డల్లాస్: అందరూ ఎదురుచూస్తున్నట్టుగా కొత్త సంవత్సరం దగ్గరికి రానే వచ్చింది. ఈ సందర్భంగా స్థానిక తెలుగువారిని అలరించడానికి, కొత్త సంత్సరానికి వినూత్నంగా స్వాగతం పలకడానికి భారి ఎత్తున సన్నాహాలు చేస్తున్నారు యుఎస్ ఇండియా ఎంటర్ టైనమెంట్ గ్రూప్. స్థానిక గ్రేప్ వైన్ కన్వెన్షన్ సెంటర్లో డిసెంబర్ 31 రాత్రి, మొట్టమొదటి సారిగా "టాలీవుడ్ మస్తి - 2014" పేరిట ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ కార్యక్రమంలో టాలీవుడ్ నుండి ఎందరో తారలు సందడి చేయనున్నారు. ఏస్ యాంకర్ ప్రదీప్ తన వ్యాఖ్యానంతో, హాస్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి శ్రోతలను అలరించనున్నారు. టాలీవుడ్ తారలు మధుశాలిని, ప్రియాబెనర్జీ, సౌమ్యా రాయ్ తమ హుషారైన నృత్యాలతో శ్రోతలను ఉర్రూతలూగించబోతున్నారు.
అదేవిధంగా ప్రముఖ గాయనీ గాయకులు రాహుల్, సాహితి తమ గాన మాధుర్యంతో , జోరైన పాటలతో కార్యక్రమంలో శ్రోతలకు వీనుల విందు చేయనున్నారు! స్థానిక యువత తమ నృత్యాలతో, కేరింతలతో కార్యక్రమానికి మరింత వన్నె చేకూర్చబోతున్నారు.
ఈ కార్యక్రమానికి టికెట్ ఖరీదు పెద్దవారికి కేవలం $65, 5 నుండి 15 సంవత్సరంలోపు పిల్లలకు $35. 5 సంవత్సరంలోపు పిల్లలకు ప్రవేశం ఉచితం, బేబీ సిట్టింగ్ సేవలు అందిస్తారు. ఈ కార్యక్రమం డిసెంబర్ 31 సాయంకాలం 8 గంటలకు మొదలై జనవరి 1, ఉదయం 1 గంటకు ముగుస్తుంది. తమ బంధు మిత్ర కుటుంబ సమేతంగా నూతన సంత్సరానికి అత్యంత ఉత్సాహంగా స్వాగతం పలకడానికి ఈ కార్యక్రమానికి హాజరు కావలసిందిగా నిర్వాహకులు ఆహ్వానం పలుకుతున్నారు.