Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
టాలీవుడ్ నిర్మాత బన్నీ వాసు ఇంట్లో తీవ్ర విషాదం: సినీ ప్రముఖుల సంతాపం
2020వ సంవత్సరం ఎంతో మంది జీవితాల్లో చేదు జ్ఞాపకాలనే మిగిల్చింది. మరీ ముఖ్యంగా ఈ ఏడాది కాలంలో సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు, వారి కుటుంబ సభ్యులు కరోనా కారణంగా ఒక్కొక్కరిగా మరణించగా, తాజాగా టాలీవుడ్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు అలియాస్ ఉదయ శ్రీనివాస్ గవర సోదరుడు సురేష్ అనారోగ్యంతో కన్నమూశారు. ఆయన మరణంతో టాలీవుడ్ వర్గాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. ఆయన మరణంపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.
ప్రస్తుతం బన్నీ వాసు తెలుగు సినీ ఇండస్ట్రీలో నిర్మాతగా వెలుగొందుతుండగా, ఆయన సోదరుడు సురేష్ ఆటోమొబైల్ ఇండస్ట్రీలోని టాప్ ఇంజనీర్లలో ఒకడిగా పేరొందారు. కొన్నేళ్ల క్రితం ఆయన డీజిల్, పెట్రోలు 4 వీలర్ వాహనాలను సీఎన్జీ(కంప్రెసర్,నేచురల్ గ్యాస్)లోకి మార్చే కిట్లను తయారు చేసే కంపెనీ స్థాపించారు. బెంగళూరులో నివాసం ఉంటోన్న ఆయన.. కొద్ది రోజులుగా కిడ్ని సంబంధిత అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆయనకు భార్య, కుమారుడు ఉన్నారు.
ఇదిలా ఉండగా, పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన బన్నీ వాసు.. అల్లు అరవింద్కు చెందిన గీతా ఆర్ట్స్ బ్యానర్లో పని చేసేవాడు. ఈ క్రమంలో జీఏ2 పిక్చర్స్కు సహా భాగస్వామిగా ఉన్నారు. ఆ తర్వాత నిర్మాతగా మారి '100% లవ్', 'కొత్త జంట', 'పిల్లా నువ్వులేని జీవితం', 'భలే భలే మగాడివోయ్', 'నెక్ట్స్ నువ్వే', 'గీతా గోవిందం', 'ప్రతిరోజూ పండగే' వంటి చిత్రాలను నిర్మించారు. అలాగే, 'సరైనోడు', 'నా పేరు సూర్య' వంటి సినిమాలకు సహా నిర్మాతగా వ్యవహరించాడు. ప్రస్తుతం ఆయన అఖిల్ హీరోగా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్' నిర్మిస్తున్నారు.