Don't Miss!
- News కేశినేని నాని Vs చిన్ని వార్ లో షర్మిల కొత్త ట్విస్ట్..!!
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Sports సూపర్మ్యాన్ స్టబ్స్: మెరుపు ఫీల్డింగ్తో ఢిల్లీని గెలిపించాడు! Video
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
టాలీవుడ్ స్టార్ ప్రభాస్ గెస్ట్ హౌజ్ సీజ్ చేసిన అధికారులు!
టాలీవుడ్ స్టార్ ప్రభాస్కు చెందిన గెస్ట్ హౌస్ను శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులు సోమవారం సీజ్ చేసిశారు. హైదరాబాద్ సమీంలోని రాయదుర్గం పైగా గ్రామ పరిధిలోని సర్వే నెం.46లోని స్థలం ప్రభుత్వం స్థలంగా గుర్తిస్తూ సుప్రీం కోర్టు తీర్పుఇవ్వడంతో అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
46 సర్వే నెంబర్లో 84.30 ఎకరాల స్థలం ఉంది. ఆ స్థలంపై ప్రభుత్వం, ప్రైవేటు వ్యక్తుల మధ్య సుప్రీంకోర్టులో కొన్నేళ్లుగా వివాదం కొనసాగింది. అయితే చివరకు కోర్టు దీన్ని ప్రభుత్వ స్థలంగా గుర్తిస్తూ తీర్పు ఇచ్చింది. ఈ స్థలంలో ప్రభాస్కు 2,200 గజాల్లో గెస్ట్ హౌస్ ఉంది.
మూడు నెలల క్రితమే తీర్పు వచ్చినా...
మూడు నెలల క్రితమే సుప్రీం కోర్టు నుంచి తీర్పు వచ్చినా... ఎన్నికల హడావుడిలో ఉన్న అధికారులు అక్రమ నిర్మాణాల తొలగింపును వాయిదా వేశారు. ఎన్నికల ముగియడంతో ఈ నిర్మాణాలపై కొరడాఝులిపించారు.
ప్రభాస్ గెస్ట్ హౌజ్ సీజ్
సోమవారం శేరిలింగంపల్లి తహసీల్దార్ వాసుచంద్ర తన సిబ్బందితో కలిసి వివాదాస్పద స్థలంలో ఉన్న కొన్ని నిర్మాణాలను కూల్చివేశారు. అయితే ప్రభాస్ గెస్ట్ హౌస్ తాళం వేసి ఉండటంతో గేటుకు నోటీసు అంటించి సీజ్ చేశారు.
ప్రభాస్ స్పందించాల్సి ఉంది
కాగా... ఈ విషయమై ప్రభాస్ స్పందించాల్సి ఉంది. ప్రస్తుతం ఆయన సాహో మూవీ షూటింగులో బిజీగా ఉన్నారు. అధికారులు ఈ విషయమై నోటీసులు పంపించే అవకాశం ఉంది.
సాహో
కాగా... ప్రభాస్ నటిస్తున్న ‘సాహో' రిలీజ్ డేట్ అధికారికంగా వెల్లడైంది. ఈ చిత్రాన్ని ఆగస్టు 15, 2019లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రభాస్, శ్రద్ధ కపూర్ హీరో హీరోయిన్లుగా సుజీత్ దర్శకత్వంలో యూవి క్రియేషన్స్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే.