Don't Miss!
- News ఐటీ హబ్ లో హైఅలర్ట్, దెబ్బకు అన్ని కంపెనీలకు సెలవు, ఓటు సరే పెళ్లామ్ తో జంప్!
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Sports SRH vs RCB: అందుకే వాషింగ్టన్ సుందర్పై వేటు వేసాం: ప్యాట్ కమిన్స్
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
వాళ్లని చంపేయండి.... అంటూ సినీ తారల డిమాండ్!
హైదరాబాద్: తెలుగు సినిమా తారలంతా ముక్తకంఠంతో గళమెత్తారు. వాళ్లని చంపేయడమే మేలని నొక్కి వక్కానిస్తున్నారు. అలాంటి వారికి భూమిపై బ్రతికే అర్హత లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీరంతా ఇంతలా గరం అవుతున్నది ఎవరిపైనో కాదు, ఇటీవల ఢిల్లీలో 23 ఏళ్ల యువతిపై గ్యాంగ్ రేప్కు పాల్పడిన కిరాతకులపై...
ఢిల్లీ గ్యాంగ్ రేప్ ఘటనపై టాలీవుడ్ స్టార్ స్పందన...
'అదొక
భయానకమైన
సంఘటన,
ఢిల్లీ
నగరానికే
సిగ్గు
చేటు.
ఢిల్లీ
దేశరాజధాని
ఈ
మధ్య
చోటు
చేసుకుంటున్న
సంఘటనలతో
మాన
భంగాలకు
రాజధానిగా
మారింది.
నిందితులకు
మరణ
శిక్ష
పడుతుందని
ఆశిస్తున్నాను'-మంచు
విష్ణు
'ఢిల్లీలో మరో రేప్ సంఘటన చోటు చేసుకోవడం విచారకరం. అది నా స్వస్థలం అని చెప్పుకోవడానికి సిగ్గు పడుతున్నాను. చాలా మంది ఇదంతా..రాత్రివేళలో బయటకు వెళ్లడం మహిళల తప్పు అని చెబుతున్నారు. కూతుర్లను రాత్రిపూట బటయటకు వెళ్ల వద్దని చెప్పడం కాదు... కొడుకులకు మంచి బుద్దులు నేర్పండి'-తాప్సీ
'రేప్ కేసు నిందితులను కఠినంగా శిక్షించాలి. ఇలాంటి కేసులు ఏళ్ల తరబడి సాగకుండా త్వరిత గతిన పూర్తి కావాలి. నిందితులకు పడే శిక్షలు మరో సారి అలాంటి తప్పు ఇంకెవరూ చేయకుండా ఉండాలి'-సిద్ధార్థ
'నిందితులకు మరణశిక్ష అయితేనే కరెక్ట్. ఇలాంటి కిరాతకులకు బ్రతికే హక్కు లేదు'-సంజన
వీరితో పాటు ఇతర తెలుగు సినీ తారలు, బాలీవుడ్ సెలబ్రిటీలు ముక్త కంఠంతో ఢిల్లీ గ్యాంగ్ రేప్ సంఘటనను గర్హించారు. నిందితులకు కఠినంగా శిక్షించాలని కొందరు, మరణ శిక్ష విధించాలని కొందరు డిమాండ్ చేసారు.
గ్యాంగ్ రేప్కు గురైన నిందితురాలు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. మరో మూడు రోజుల వరకు ఆమె కండిషన్ క్రిటికల్గానే ఉంటుందని వైద్యులు చెప్పారు. అంతర్గత అవయవాలు బాగా దెబ్బతిన్నాయని, దాడి చేసిన వారు జంతువుల కన్నా ఘోరంగా ప్రవర్తించారని వైద్యులు అభిప్రాయపడ్డారు. బుధవారం మధ్యాహ్నం కేంద్రమంత్రి కృష్ణ తీర్థ్ సఫ్తర్ జంగ్ ఆసుపత్రిలో ఉన్న బాధితురాలిని పరామర్శించారు.