twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    డిసెంబర్ 7న టాలీవుడ్ స్టార్స్ క్రికెట్ మ్యాచ్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: టాలీవుడ్ స్టార్స్ అంతా కలిసి డిసెంబర్ 7న క్రికెట్ మ్యాచ్ ఆడబోతున్నారు. ఇందుకు విజయవాడలోని గాంధీ మున్సిపల్ స్టేడియం వేదిక కానుంది. ఈ మ్యాచ్ నిర్వహణ ద్వారా వచ్చిన డబ్బులను హుధూద్ తుఫాన్ బాధితుల సహాయార్థం అందజేయనున్నారు. టాలీవుడ్ క్రికెట్ అసోషియేషన్ ఆధ్వర్యంలో ఈ మ్యాచ్ జరుగనుంది.

    ఈ విషయమై హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.....హుధూత్ తుఫాన్ బాధితులను ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో ఈ చారిటీ మ్యాచ్ ప్లాన్ చేసినట్లు తెలిపారు. తెలుగు సినిమా అభిమానులంతా తమ ప్రయత్నాన్ని విజయవంతం చేయాలని, హుధూద్ బాధితులకు అండగా నిలవాలని తెలిపారు.

    Tollywood stars to play cricket match Details

    అల్లరి నరేష్ మాట్లాడుతూ తుఫాన్ కారణంగా ఎంతో నష్టపోయిన సాటి తెలుగు వారికి ఏదైనా చేయాలనే సదుద్దేశ్యంతో మ్యాచ్ నిర్వహిస్తున్నామని, తద్వారా వచ్చిన మొత్తాన్ని సీఎం చంద్రబాబును కలిసి అందజేయనున్నట్లు తెలిపారు. ఈ మీడియా సమావేవంలో టాలీవుడ్ స్టార్స్ తరుణ్, తనీష్, ప్రిన్స్, నవీన్ చంద్ర తదితరులు పాల్గొన్నారు.

    English summary
    Tollywood Cricket association has geared up to launch a stars Cricket match at Vijayawada on Dec 7. The Cricket match is being organised for generating funds for Hudhud cyclone victims of north coastal districts of AP.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X