Don't Miss!
- Finance Gold Price Today: బంగారం ధర పై పైకే.. ఇక కొనలేమా..!
- News సీట్ల మార్పులో బీజేపీ కొత్త ట్విస్ట్- చంద్రబాబు నిర్ణయం ఏంటి..!!
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Automobiles హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- Sports రోహిత్పై వేటు వేయడానికి కారణమిదే- రాబిన్ ఉతప్ప
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
డిసెంబర్ 7న టాలీవుడ్ స్టార్స్ క్రికెట్ మ్యాచ్
హైదరాబాద్: టాలీవుడ్ స్టార్స్ అంతా కలిసి డిసెంబర్ 7న క్రికెట్ మ్యాచ్ ఆడబోతున్నారు. ఇందుకు విజయవాడలోని గాంధీ మున్సిపల్ స్టేడియం వేదిక కానుంది. ఈ మ్యాచ్ నిర్వహణ ద్వారా వచ్చిన డబ్బులను హుధూద్ తుఫాన్ బాధితుల సహాయార్థం అందజేయనున్నారు. టాలీవుడ్ క్రికెట్ అసోషియేషన్ ఆధ్వర్యంలో ఈ మ్యాచ్ జరుగనుంది.
ఈ విషయమై హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.....హుధూత్ తుఫాన్ బాధితులను ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో ఈ చారిటీ మ్యాచ్ ప్లాన్ చేసినట్లు తెలిపారు. తెలుగు సినిమా అభిమానులంతా తమ ప్రయత్నాన్ని విజయవంతం చేయాలని, హుధూద్ బాధితులకు అండగా నిలవాలని తెలిపారు.
అల్లరి నరేష్ మాట్లాడుతూ తుఫాన్ కారణంగా ఎంతో నష్టపోయిన సాటి తెలుగు వారికి ఏదైనా చేయాలనే సదుద్దేశ్యంతో మ్యాచ్ నిర్వహిస్తున్నామని, తద్వారా వచ్చిన మొత్తాన్ని సీఎం చంద్రబాబును కలిసి అందజేయనున్నట్లు తెలిపారు. ఈ మీడియా సమావేవంలో టాలీవుడ్ స్టార్స్ తరుణ్, తనీష్, ప్రిన్స్, నవీన్ చంద్ర తదితరులు పాల్గొన్నారు.