Don't Miss!
- News బీఆర్ఎస్కు బిగ్ షాక్.. కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్న వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి
- Sports SRHకు భయపడి CSK సంచలన నిర్ణయం: ధోనీ మైండ్ గేమ్?
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Lifestyle హడలెత్తిస్తున్న Bird Flu పాలు,గుడ్లు మరియు చికెన్ తినడం సురక్షితమేనా?మనుషులకూ వ్యాపిస్తుందా..నిపుణులు ఏమంటారు?
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
హాజరేకు జై కొట్టిన టాలీవుడ్-సర్కార్ తీరుపై నిరసన
దేశంలో అవినీతి నిర్మూలించడాని బలమైన 'జన్ లోక్ పాల్ బిల్లు" రావాలనే డిమాండ్ తో పోరాటం చేస్తున్న గాంధేయవాది అన్నా హజారేకు తెలుగు సినిపరిశ్రమ జై కొట్టింది. తమ మద్దతు తెలుపుతూ సంఘీభావం ప్రకటించింది. అదే సమయంలో అన్నా ఉద్యమాన్ని అణచి వేసేందుకు ప్రయత్నిస్తున్న కేంద్ర ప్రభుత్వ తీరును తప్పు బట్టింది. ఈ మేరకు అన్నా పోరాటానికి మద్దతు పలుకుతూ శుక్రవారం హైదరాబాద్ లోని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎదుట ర్యాలీ నిర్వహించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను వ్యతిరేకిస్తూ నోటికి నల్ల గుడ్డలు కట్టుకుని నిరశన తెలిపారు.
ఈ కార్య్రకమంలో దర్శక రత్న దాసరి నారాయణరావుతో పాటు పలువురు దర్శకులు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మురళీ మోహన్, పరుచూరి బదర్స్, హాస్య నటుడు బాబుమోహన్, నటి జీవిత, సంజన తదితరులు పాల్గాన్నారు. ఈ కార్య్రకమానికి అగ్రహీరోలు, మరికొందరు ప్రముఖులు దూరంగా ఉండటం విమర్శలకు తావిస్తోంది.