Don't Miss!
- News మేషరాశిలో శుక్రుడు.. ఈ రాశులవారికి తీవ్ర అనారోగ్యం.. జాగ్రత్త!!
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
సీఎం జగన్తో టాలీవుడ్ అగ్ర నిర్మాతల భేటీ.. అసలు కారణం ఇదే.. మాటిచ్చిన ముఖ్యమంత్రి!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్తో టాలీవుడ్ చిత్రసీమలోని అగ్ర నిర్మాతలు భేటీ అయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్ వెళ్లి అక్కడ ఆయన్ను కలిసి కాసేపు ముచ్చటించారు. దీంతో ఈ అంశం వార్తల్లో ప్రధాన శీర్షికల్లో ఒకటిగా నిలిచింది. ఇంతకీ జగన్తో టాలీవుడ్ అగ్ర నిర్మాతల భేటీ ఎందుకు జరిగింది? జగన్ని కలిసిన ఆ నిర్మాతలెవరు? వివరాల్లోకి పోతే..
Recommended Video
జగన్తో భేటీ అయిన నిర్మాతలు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో తెలుగు సినీ పరిశ్రమ అగ్ర నిర్మాతలు దగ్గుబాటి సురేష్ బాబు, శ్యాం ప్రసాద్ రెడ్డిలతో పాటు జెమిని కిరణ్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేనివంశీ కూడా పాల్గొన్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్లో ఈ భేటీ జరిగింది.
సీఎంకి ఆహ్వానం.. అసలు కారణమిదే
జగన్తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన నిర్మాతలు.. సమావేశ వివరాలు తెలిపారు. తాము సీఎం జగన్ని కలవడానికి ప్రత్యేకమైన కారణం ఉందని, అందుకే ఆయనతో భేటీ అయి కాసేపు మాట్లాడామని తెలిపారు. ఈ మేరకు విశాఖలో జరకాబోయే ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమానికి రావాలని సీఎంకి ఆహ్వానం పలికినట్లు చెప్పారు.
తుఫాన్ దెబ్బకు భారీ నష్టం.. బాధితులకు అండగా టాలీవుడ్
2014 సంవత్సరం విశాఖలో సంభవించిన హుద్ హుద్ తుఫాన్ దెబ్బకు భారీ నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే. తుఫాన్ కారణంగా ఎందరో పేద ప్రజలు నిరాశ్రయులయ్యారు. దీంతో ఆ సమయంలో ఇళ్లు కోల్పోయిన నిరుపేదలకు టాలీవుడ్ ఇండస్ట్రీ అండగా నిలిచింది. వాళ్లకు తిరిగి ఆశ్రయం కల్పించాలనే దృఢ సంకల్పంతో 15 కోట్ల రూపాయల విరాళాలను సేకరించి కొత్త ఇల్లు నిర్మించింది.
మాటిచ్చిన జగన్..
కాగా ఈ సమావేశంలో తుఫాన్ బాధితుల కోసం తెలుగు సినీపరిశ్రమ సాయంతో 320 ఇళ్లు నిర్మించిన విషయాన్ని సీఎం దృష్టికి తీసుకొచ్చినట్లు నిర్మాతలు తెలిపారు. ఆ ఇళ్లను ప్రారంభించడానికి రావాలని జగన్ను ఆహ్వానించినట్లు చెప్పారు. దీనిపై సీఎం జగన్ సానుకూలంగా స్పందించారని, ఈ మంచి పనిలో తాను భాగమై పూర్తయిన ఇళ్లను పేదలకు పంపిణీ చేస్తానని మతిచ్చారని చెప్పారు.