Don't Miss!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- News టీడీపీ గెలుపు కష్టమే.. ఎంపీ అభ్యర్థి అభ్యర్థి లావు కృష్ణ దేవరాయలు షాకింగ్ కామెంట్స్
- Technology ఫిజికల్ బటన్ లు లేకుండా రానున్న iPhone 16 ! డిజైన్ వివరాలు లీక్
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Finance ITC: ఐటీసీ ఇన్వెస్టర్లకు శుభవార్త.. !
- Sports చరిత్ర సృష్టించిన అక్షర్ & పంత్ క్రేజీ రికార్డు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
శిల్పా చీట్స్ : మహేష్ సోదరి మాత్రమే కాదు.. మూడు కోట్లు సమర్పించుకున్న మరో యంగ్ హీరో!
టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారిన శిల్పా చౌదరి గురించి రోజుకో విషయం బయటకు వస్తోంది. ఈ మధ్యనే మహేశ్ బాబు సోదరి, యువ హీరో సుధీర్ బాబు భార్య ప్రియదర్శిని కూడా శిల్పా చౌదరిపై ఫిర్యాదు చేశారు. 2 కోట్ల 90 లక్షల రూపాయలు తీసుకుని, తిరిగి ఇవ్వలేదని కంప్లైంట్లో పేర్కొనగా ఇప్పుడు ఆమెను నమ్మిన మరో హీరో బయట పడ్డారు ఆ వివరాల్లోకి వెళితే
ఒక్కరొక్కరుగా బయటకు
కిట్టి పార్టీల పేరుతో ప్రముఖులతో పరిచయం పెంచుకుని, కొన్ని రోజుల తర్వాత రియల్ ఎస్టేట్ మీద అధిక లాభాలు, కొన్ని వ్యాపారాల్లో అధిక లాభాలు పేరుతొ మోసం చేసి కోట్లు కొల్లగొట్టిన శిల్పా చౌదరి చేతిలో మోసపోయిన సెలబ్రిటీలు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. ఇటీవల మహేశ్ బాబు సోదరి, యువ హీరో సుధీర్ బాబు భార్య ప్రియదర్శిని కూడా శిల్పా చౌదరి మీద ఫిర్యాదు చేశారు.
మహేష్ బాబు సోదరి
తన వద్ద శిల్ప 2 కోట్ల 90 లక్షల రూపాయలు తీసుకుని, తిరిగి ఇవ్వలేదని ప్రియదర్శిని కంప్లైంట్లో పేర్కొన్నారు. తాజాగా శిల్పా చౌదరి మాయమాటలు నమ్మి హీరో హర్ష్ కనుమిల్లి నట్టేట మునిగినట్టు చెబుతున్నారు. తాజాగా ఆయన 3 కోట్లు నష్టపోయానని హర్ష్ ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ముందుగా శిల్పా పార్టీలకు అటెండ్ అయి ఆమె ట్రాప్లో ఈ యువ హీరో పడ్డాడని అంటున్నారు .
సొంత హీరోనే ట్రాప్ చేసి
నిజానికి 'సెహరి' సినిమాలో హర్ష్ కనుమిల్లి హీరోగా నటించాడు. ఈ సినిమాకే ఆమె నిర్మాతగా వ్యవహరించిందని అంటున్నారు. ఆమె ఈ సినిమాను వర్గో పిక్చర్స్ బ్యానర్ మీద అద్వయ రెడ్డితో అలిసి నిర్మించిందని అంటున్నారు. ఇక ఆమె మీద మరికొందరు సెలబ్రిటీలు కూడా ఫిర్యాదు చేయడానికి సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరో పక్క శిల్పా చౌదరిని కస్టడీలోకి తీసుకోనున్నారు నార్సింగి పోలీసులు.
ఫేక్ బంగారం, నకిలీ చెక్కులు
సెలబ్రిటీలు, వ్యాపారవేత్తల దగ్గర కోట్ల రూపాయలు తీసుకున్న శిల్పా చౌదరి వారికి ఫేక్ బంగారం, నకిలీ చెక్కులు అంట గట్టిందని చెబుతున్నారు. అలా హీరో సుధీర్ బాబు భార్య ప్రియదర్శిని దగ్గర 2 కోట్ల 90 లక్షల రూపాయలు తీసుకుని మూడు నకిలీ చెక్కులు, నకిలీ బంగారాన్ని ష్యూరిటీ కింద ఇచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఆమె ఇచ్చిన చెక్కు మార్చేందుకు ఇండియన్ బ్యాంక్కు వెళ్లిన ప్రియదర్శిని.. మోసపోయినట్టు తెలుసుకుని షాక్ అయింది.
Recommended Video
చాలా మంది బాధితులు
దీంతో ఆమె వెంటనే పోలీసులను ఆశ్రయించింది. ఇలా ఆమె బారిన పడిన చాలా మంది బాధితులు ఉన్నారని అంటున్నారు. ఇక దోచిన మొత్తాన్ని ఏయే రూపాల్లో ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేసిందన్న వివరాలపై కూడా ఆరా తీయనున్నారు. శిల్పా భర్త శ్రీనివాస్ ప్రసాద్కు రాజేంద్రనగర్ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయగా శిల్ప బెయిల్ పిటిషన్ ను మాత్రం తిరస్కరించింది. ఆమెను 2 రోజుల పోలీస్ కస్టడీకి కూడా అనుమతించింది. శిల్పను కస్టడీకి తీసుకున్న నార్సింగి పోలీసులు శుక్రవారం, శనివారం శిల్పాను విచారించనున్నారు. ఇక ఆమె పోలీసుల కస్టడీలో శిల్పా చౌదరి ఉండడంతో ఆమె బాధితులు ఒక్కొక్కరుగా బయటికొస్తున్నారు.