Don't Miss!
- News రాహుల్ సహా నేడు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటోన్న కీలక నేతలు వీరే..
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రేపు తేలనున్న‘ఊసరవెల్లి’ భవితవ్యం
సినిమాలో పాటలు విడుదలైతే చాలు సినిమా భవితవ్యం ఏమిటో సగానికి సగం ఊహించుకోవచ్చు. కొన్ని సినిమాలైతే కేవలం ఆడియోతోనే హిట్ అయిన సందర్భాలున్నాయి. కొన్ని సందర్భాల్లో మాత్రం ఆడియోతో సంబంధం లేకుండా సినిమా జయాపజయాలు ఉంటాయి. ఉదా హరణకు ఆరెంజ్ సినిమా తీసుకుంటే..ఆడియో హిట్టు, సినిమా ఫట్టు.
జూనియర్ ఎన్టీఆర్ గతంలో నటించిన శక్తి సినిమా పరమ ప్లాపుగా నిలిచింది. ఆ సినిమా ఆడియో కూడా ఏమంత బాగోలేదనే విమర్శ కూడా అప్పట్లో వినిపించింది. సినిమా స్టోరికీ తోడు ఆడియో కూడా ఆకట్టుకోక పోవడం వల్లనే తీవ్రమైన పరాజయం చవి చూడాల్సి వచ్చింది. దీంతో తన తాజా సినిమా ఊసరవెల్లిపై బోలెడు ఆవలు పెట్టుకున్నాడు జూనియర్. ఈ చిత్రం ఆడియో రేపు(సెప్టెంబర్ 15)న విడుదల కాబోతోంది. దీని ద్వారా సినిమా సగం భవితవ్యం ఏమిటో తేల నుండటంతో ఎన్టీఆర్ తో పాటు, అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. గురువారం సాయంత్రం హైదరాబాద్ శిల్పకళావేదికలో ఆదిత్య మ్యూజిక్ ద్వారా పాటలు విడుదల చేస్తున్నారు. ఎన్టీఆర్ అభిమానులు సహా ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొంటారు.
ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన తమన్నా కథానాయిక. సురేందర్రెడ్డి దర్శకుడు. భోగవల్లి బాపినీడు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర ఇండియా పతాకంపై ఛత్రపతి ప్రసాద్ నిర్మిస్తున్నారు.