Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఆ టాప్ హీరోల 16 ఏళ్ళ ఫైట్ ముగిసింది
ఇవాళా నిన్నటిది కాదు పదహారు ఏళ్ళ నుండి షారూఖ్ ఖాన్, సన్నీడయోల్ మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. డర్ చిత్రం చేస్తున్నప్పుడు వచ్చిన వివాదం వారిద్దరినీ విడతీసింది. అప్పుడు నుంచీ వీరిద్దరూ మాట్లాడుకోలేదు..కలిసి పని చేయలేదు. అయితే ప్రముఖ దర్శకుడు సుభాష్ ఘయ్ తాజాగా వీరిద్దరినీ కలిపాడు.దాంతో షారూఖ్ తన పాత విషయాలు మరిచి సన్నీ డయోల్ కి పార్టీ ఇచ్చాడు. ఆ పార్టీకి షారూఖ్ కి సన్నిహితుడైన కరణ్ జోహార్ వస్తే,సన్నీ తో పాటు ఆయన స్నేహితుడు దర్శకుడు నీరజ్ పాఠక్ వచ్చారు. మధ్యవర్తిగా సుభాష్ ఘయ్ వీరిద్దరిని దగ్గరికి పిలిచి మళ్ళీ రీ ఇంట్రడ్యూస్ చేసి కలిపాడు. ఇద్దరూ షేక్ హ్యాండ్ ఇచ్చుకుని ఛీర్స్ చెప్పుకున్నారు. అక్కడ నుంచీ వాళ్ళిద్దరూ కబుర్లే..కబుర్లు..ఆ సాయింత్రం అలా ఇద్దరూ పాత విషయాలు గుర్తు చేసుకుంటూ గడిపారు. అంటే త్వరలోనే వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుందేమో.