Don't Miss!
- News పవన్ ను ఆడిస్తున్న చంద్రబాబు-పెళ్ళిళ్లే కాదు సీట్లూ నాలుగే- కాకినాడలో జగన్ కామెంట్స్..!
- Sports SRH playing XI: అతనిపై వేటు..ఢిల్లీతో ఆడే తుదిజట్టు ఇదే
- Technology Lava ProWatch లావా ప్రోవాచ్ డిజైన్, ధర వివరాలు లీక్.. ఫంక్షన్ కీ సహా కీలక హెల్త్ ట్రాకర్లు..!!
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ట్రెండింగ్: కసితో పెళ్లి చేసుకున్నా.. ఎన్టీఆరే వాళ్లకు సరైనోడు..మీ అబ్బాయితో డేటింగ్ వెళ్తా..తాప్సీ
మా అసోసియేషన్ ఎన్నికల హీట్ రోజురోజుకు పెరుగుతోంది. నరేష్, శివాజీ రాజా ఒకరిపై ఒకరు తీవ్రమైన విమర్శలు చేసుకుంటున్నారు.వ్యాంపు టైపు రోల్స్ తో పాలుపర్ అయిన నటి జ్యోతి తన వివాహం, ప్రేమ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
ఫీజు రీయింబర్స్ మెంట్ విషయంలో మంచు కుటుంబం ప్రభుత్వంపై మరోమారు చెలరేగారు. మోహన్ బాబు చంద్రబాబుని విమర్శించిన కొద్ది రోజులకే మంచు మనోజ్ కూడా విమర్శలకు దిగడం చర్చనీయాంశంగా మారింది. తెలుగు యాంకర్ శ్రావ్య రెడ్డి మరో కొత్త ఛాలెంజ్ కు తెరతీసింది. బీర్ బాటిల్ ఛాలెంజ్ అంటూ ఆమె పోస్ట్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.. ఇలాంటి హాట్ హాట్ న్యూస్ ఈ వారం ట్రెండింగ్ గా నిలిచాయి.
ఆ కసితో పెళ్లి చేసుకున్నా.. రెండు లవ్ ఫెయిల్యూర్స్.. నా జీవితానికి వాడు చాలు!
క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రొమాంటిక్ కామెడీ పాత్రలతో నటి జ్యోతి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అడల్ట్ కామెడీ తరహాలో ఉండే రోల్స్ లో జ్యోతి ఎక్కువగా నటించింది. జ్యోతి తెలుగు బిగ్ బాస్ 1 సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జ్యోతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో జ్యోతి తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలని వెల్లడించింది. ప్రేమ, బ్రేకప్, పెళ్లి లాంటి అంశాలు తన జీవితంలో చేదు అనుభవాలుగా మిగిలిపోయాయని జ్యోతి తెలిపింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
పేరు నాది, డబ్బు అన్నయ్యది.. నష్టపోయాం, ఇపుడు ధైర్యం లేదు: నాగబాబు
నా ఛానల్ నా ఇష్టం పేరుతో కొన్ని రోజులుగా పొలిటికల్ సెటైరికల్ వీడియోలు వదులుతున్న మెగా బ్రదర్ నాగబాబు ఈ సారి రూటు మార్చి సినిమా టాపిక్ గురించి మాట్లాడారు. నిర్మాతగా తన తొలి సినిమా 'రుద్రవీణ' జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.'రుద్రవీణ' అంజనా ప్రొడక్షన్ బేనర్లో ఫస్ట్ విడుదలైన సినిమా. అప్పుడే ఫ్రెష్గా ఎల్ఎల్బి పూర్తి చేసుకుని ఎంబీఏ చేద్దామనుకుంటే తనతో పాటు సినిమా ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్గా ఉండొచ్చుకదా అని అన్నయ్య అడిగారు. నాకు కూడా అన్నయ్యతో ఉండాలని, ట్రావెల్ చేయాలనే కోరిక ఉండేది. అందుకే ఫిల్మ్ ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలని నిర్ణయించుకున్నాను అని నాగబాబు తెలిపారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
మీ అబ్బాయితో డేటింగ్ వెళ్తా.. పర్మిషన్ ఇస్తారా.. తాప్సీ.. ఎవరితోనంటే..!
బాలీవుడ్ జంట సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ ఖాన్ కుమారుడు తైమూర్ ఆలీ ఖాన్కు దాదాపు చిన్నసైజు హీరోకు ఉన్న పాపులారిటీ మీడియాలో ఉందంటే అతిశయోక్తి కాదు. తైమూరు అభిమానుల జాబితాలో తాప్సీ కూడా చేరిపోయింది. కరీనాను ఇటీవల ఓ ఆసక్తికరమైన కోరిక కోరింది. అదేమిటంటే..
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
పెళ్ళాం ఊరెళితేకి కాపీ.. తమన్నా, మెహ్రీన్ బికినిలో.. రాఘవేంద్ర రావు హాట్ కామెంట్స్!
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలసి నటించిన మల్టీస్టారర్ ఎఫ్2 ఇప్పటికీ బ్లాక్ బస్టర్ విజయం సొంతం చేసుకుంది. చాలా కాలం తర్వాత వెంకటేష్ కామిక్ రోల్ లో చెలరేగిపోయి నటించాడు. వెంకీ, వరుణ్ తోడల్లుళ్లుగా చేసిన రచ్చని ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రం విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకుంది. అర్థ శతదినోత్సవ వేడుకని చిత్ర యూనిట్ ఘనంగా నిర్వహించారు. రాఘవేంద్ర రావు, ఎస్వీ కృష్ణారెడ్డి లాంటి సీనియర్ దర్శకులు ఈ వేడుకకు అతిథులుగా హాజరయ్యారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
ఇలాగైతే మా ఆస్తులు అమ్మేసుకోవాలి.. చంద్రబాబుపై మంచు విష్ణు అటాక్!
సీనియర్ నటుడు మోహన్ బాబు సినిమాల్లో నటిస్తూనే అప్పుడప్పుడూ రాజకీయ పరమైన వ్యాఖ్యలు కూడా చేస్తుంటారు.మోహన్ బాబు తనయులు మంచు విష్ణు, మనోజ్ ఇద్దరూ సినిమాల్లో నటిస్తున్నారు. సినిమా నిర్మాణంలో కూడా మంచు ఫ్యామిలీ భాగమవుతూ ఉంటుంది. వీటితో పాటు మోహన్ బాబు శ్రీ విద్యానికేతన్ సంస్థల్ని కూడా నడిపిస్తున్నారు. ఇటీవల మోహన్ బాబు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుని ఇంజనీరింగ్ కళాశాలల ఫీజు రీయింబర్స్ మెంట్ విషయంలో నిలదీసిన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యలకు కొనసాగింపుగా మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు రంగంలోకి దిగాడు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
నా మిత్రుడు రాజేంద్ర ప్రసాద్కి హ్యాట్సాఫ్..తలుచుకుంటే ఏడుపొస్తుంది.. నరేష్!
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. మా అసోసియేషన్ కు మార్చి 10న ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుత అధ్యక్షుడు శివాజీ రాజా పదవీకాలం ముగియడంతో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. సీనియర్ నటుడు నరేష్, శివాజీ రాజా అధ్యక్ష పదవి కోసం పోటీలో నిలిచాడు. నరేష్ తరుపున ప్యానల్ సభ్యులుగా హీరో రాజశేఖర్, జీవిత దంపతులు బరిలో నిలిచారు.మా ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో గెలుపు కోసం ఇటు నరేష్, అటు శివాజీ రాజా ప్రయత్నాలు మొదలు పెట్టారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
దారుణమైన హింస.. కొడితే చెవి పగిలింది.. జీవితం నాశనం.. సల్మాన్ సన్నిహితుడి అరాచకాలు
బాలీవుడ్ సూపర్స్టార్ సల్మాన్ ఖాన్ నిర్వహించే బీయింగ్ హ్యుమన్ సంస్థ వివాదంలో చిక్కుకొన్నది. ఆ సంస్థ సీఈవో తనను లైంగికంగా వేధించాడని యాక్టర్, మోడల్ ఆండ్రియా డిసౌజా పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
జూ. ఎన్టీఆరే సరైనోడు, వాళ్ళ ఇష్టారాజ్యం అయిపోయింది.. నటి జ్యోతి హాట్ కామెంట్స్!
క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రొమాంటిక్ కామెడీ పాత్రలతో నటి జ్యోతి మంచి గుర్తింపు తెచ్చుకుంది. క్యారెక్టర్ ఆర్టిస్టుగా గ్లామర్ టచ్ ఉండే రోల్స్ లో చెలరేగి నటించడం జ్యోతి శైలి. జ్యోతి తెలుగు బిగ్ బాస్ 1 సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొన్న సంగతి తెలిసిందే. మరి కొన్ని నెలల్లో బిగ్ బాస్ 3 ప్రారంభం కాబోతోంది. ఈ సందర్భంగా జ్యోతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో బిగ్ బాస్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బిగ్ బాస్ 1తో పోల్చుతూ బిగ్ బాస్ 2పై సంచలన వ్యాఖ్యలు చేసింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
హాట్ తెలుగు యాంకర్ బీర్ ఛాలెంజ్, ఐస్ ముక్కలతో కొత్త ప్రయోగం!
తెలుగు యాంకర్, నటి, హాట్ మోడల్ శ్రావ్య రెడ్డి అభిమానులను ఎంటర్టెన్ చేయడమే లక్ష్యంగా యూట్యూబ్ వీడియోలతో చెలరేగిపోతోంది. బీర్ ఛాలెంజ్, ఐస్ చాలెంజ్ అంటూ విభిన్నమైన సవాల్స్ విసురుతూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. గతంలో ఫిట్నెస్ వీడియోలు చేసిన శ్రావ్య రెడ్డి వాటికి అంతగా రెస్పాన్స్ రాక పోవడంతో రూటు మార్చారు. ఎంటర్టెన్మెంట్ పంచే వీడియోలకు మంచి డిమాండ్ ఉండటంతో వాటికి తన సెక్సీ యాటిట్యూడ్ మిక్స్ తన ఛానల్ వైపు నెటిజన్లను ఆకర్షిస్తోంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
నా కడుపులో తన్నింది నిజమే.. హీరో పేరు చెప్పిన శివ పార్వతి, ఏం జరిగిందంటే..
క్యారెక్టర్ ఆర్టిస్టుగా తెలుగుతో పాటు పలు దక్షిణాది భాషల్లో నటించిన ప్రముఖనటి శివ పార్వతి ఇటీవల ఓ వెబ్ ఇంటర్వ్యూలో తన కెరీర్కు సంబంధించిన ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ఒక పెద్ద హీరో సినిమా షూటింగ్ జరిగే సమయంలో క్యారెక్టర్లో అతిగా ఇన్వాల్వ్ అయిపోయి మిమ్మల్ని కాలుతో కడుపులో తన్నారట, మీరు దూరం పడిపోయి.. ఆల్మోస్ట్ కోమాలోకి వెళ్లిపోయే పరిస్థితికి వెళ్లారట.. నిజమేనా? అనే ప్రశ్నికు శివ పార్వతి స్పందిస్తూ ఆ రోజు ఏం జరిగిందో వెల్లడించారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
ముఖం చాటేసిన డైరెక్టర్.. హీరోయిన్తో పెళ్లి తర్వాత అజ్ఞాతంలోకి.. ఏం జరిగిందంటే..
దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే లాంటి ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు ఆదిత్య చోప్రా ఇటీవల కాలంలో బాహ్య ప్రపంచానికి దూరంగా బతుకుతున్నాడు. హీరోయిన్ రాణి ముఖర్జీతో వివాహం తర్వాత మీడియాకు, అటు సినీ సెలబ్రిటీలకు ముఖం చాటేస్తున్నాడు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
‘మంచు' వారికి ఆ జబ్బు ఉంది.. చిత్రం శ్రీను కామెంట్కు మంచులక్ష్మి కౌంటర్
మిసెస్ సుబ్బలక్ష్మి అనే వెబ్ సిరీస్తో డిజిటల్ ప్రపంచంలోకి మంచు లక్ష్మి ప్రవేశించారు. ఈ వెబ్ సిరీస్కు సంబంధించిన మీడియా సమావేశం హైదరాబాద్లో నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్రం శ్రీను కామెంట్కు మంచు లక్ష్మి స్పందిస్తూ.. టైమ్కు రావడం నాకు అలవాటు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
కౌశల్కు చెక్: చిరంజీవిని కలిసిన తనీష్.. రంగంలోకి మెగాస్టార్.. ఏం జరుగుతున్నదంటే!
బిగ్బాస్ తెలుగు రియాలిటీ షో ముగిసి నెలలు కావొస్తున్న ఆ ఇంటిలో గడిపిన స్టార్ల మధ్య గొడవలు మాత్రం మీడియాలో రచ్చ రచ్చగా మారాయి. అయితే బిగ్బాస్ షో వరకే పరిమితం అవుతాయనుకొంటే అవి ఇప్పుడు తనీష్, కౌశల్ మధ్య గొడవలు నిప్పులా రాజుకొని మంటల తయారయ్యాయి.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
‘మహానాయకుడు'పై ఎన్టీఆర్ అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు సంచలన కామెంట్!
మహానటుడు, దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు జీవితం ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. మొదటి భాగం 'ఎన్టీఆర్-కథానాయకుడు'కు క్రిటిక్స్ నుంచి ప్రశంసలు అందినప్పటికీ... రెండో భాగం 'మహానాయకుడు' మాత్రం విమర్శల పాలైంది. కాగా.. ఎన్టీఆర్ బయోపిక్పై ఎన్టీఆర్ మరో అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
లక్ష్మీ పార్వతికి 10 ప్రశ్నలు... దీనికి ఆమె వద్ద సమాధానం ఉందా?
లక్ష్మీ పార్వతి తీరును ముందు నుంచి వ్యతిరేకిస్తున్న తెలుగు ఫిల్మ్మేకర్ కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ఆమె అసలు కథ ఇదే అంటూ 'లక్ష్మీస్ వీరగ్రంథం' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన లక్ష్మీ పార్వతిని నిలదీస్తూ ఆయన 10 ప్రశ్నలు సంధించారు. లక్ష్మీ పార్వతిలో నిజాయితీ ఉంటే నా ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి. నేను సమాజంలో విలువల కోసం పోరాటం చేస్తున్న వ్యక్తిని, ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం మీకు ఉంది అంటూ ఓ వీడియో విడుదల చేశారు.