Don't Miss!
- Sports వేరీజ్ `మ్యాడ్` మ్యాక్సీ: ఆర్సీబీలో గందరగోళం
- News వైసీపీ అభ్యర్థికి జగన్ బంపర్ ఆఫర్.. పులివెందుల నుంచి పోటీ చేయలంటూ సూచన
- Finance Bank Holidays: ఏప్రిల్ లో 14 రోజులు బ్యాంకులకు సెలవులు..
- Automobiles కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
ట్రెండింగ్: బోరున ఏడ్చిన ఎన్టీఆర్, శ్రీరెడ్డి జీవితంలో సడెన్ టర్న్, అక్కినేని ఫ్యామిలీ వెకేషన్...
సెక్స్ కోసం వేధిస్తావు, మాళవిక గతేమైంది? నీ కూతురు పారిపోలేదా? శ్రీరెడ్డి సంచలనం, ఆడవాళ్లను తిడుతున్నారు, కౌశల్ ఇప్పటికైనా నీ ఫ్యాన్స్ను కంట్రోల్ చేయంటున్న సామ్రాట్, ఇక్కడ దారుణం... అక్కడ స్వర్గం శ్రీరెడ్డి జీవితంలో సడెన్ టర్న్, యాంకర్ ప్రదీప్ 'పెళ్లిచూపులు'షోకు అమ్మాయిల ఎంపిక వెనక సంచలన విషయాలు, అక్కినేని ఫ్యామిలీ వెకేషన్ ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ సంబరాల్లో చైతూ-సామ్, తండ్రి చితికి నిప్పు పెట్టలే.. బతికి ఉంటే విలువ తెలియలే, నాన్నకు మాట చెప్పలే.. భోరున ఏడ్చిన ఎన్టీఆర్, ఎప్పటికీ పవన్ నా దేవుడే.. ప్రతీసారి కోసుకొని చెప్పాలా? ఆ హీరోకు మోసం చేయలేదు.. బండ్ల గణేష్, బిగ్ బాస్ అసలు విజేతలు వీళ్ళే , కౌశల్ కాదు.. దుమారం రేపుతున్న తేజస్వి, అందుకే పిల్లల్ని కనలేదు.. నా మరణం తర్వాత.. విజయశాంతి, చిరంజీవి, పవన్పై సీరియస్ కామెంట్... ఇలా గతం వారం పలు అంశాలు ఇంటర్నెట్లో ట్రెండ్ అయ్యాయి. మీరు ఏమైనా మిస్సయి ఉంటే... ఓ లుక్కేయండి.
సెక్స్ కోసం వేధిస్తావు, మాళవిక గతేమైంది? నీ కూతురు పారిపోలేదా? శ్రీరెడ్డి సంచలనం
కాస్టింగ్ కౌచ్ ఇష్యూపై టాలీవుల్లో తన గళం విప్పి పలువురు కామాంధుల్లో వణుకు పుట్టించిన శ్రీరెడ్డి.... చెన్నై వెళ్లి కోలీవుడ్లోనూ అలాంటి ప్రకంపణలే క్రియేట్ చేసింది. ప్రస్తుతం తమిళంలో సినిమాలు చేస్తూ కొంతకాలంగా ఇలాంటి గొడవలకు దూరంగా ఉంటున్న ఈ వివాదాస్పద నటి తాజాగా మరోసారి ఆరోపణల వర్షం కురిపించింది. తెలుగు ఇండస్ట్రీకి చెందిన ఓ సీనియర్ నటుడి గురించి సంచలన ఆరోపణలు చేసింది. అంతే కాదు ఒక హీరోయిన్ పేరు ప్రస్తావిస్తూ... ఆమె సినీ ఇండస్ట్రీని వదిలి వెళ్లిపోయిన వైనాన్ని వెల్లడిస్తూ శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
ఆడవాళ్లను తిడుతున్నారు, కౌశల్ ఇప్పటికైనా నీ ఫ్యాన్స్ను కంట్రోల్ చేయ్: సామ్రాట్
కౌశల్ ఆర్మీ తమ అభిమానాన్ని చాటుకోవడానికి ఇతరులను దారుణంగా ట్రోల్ చేయడం, ఆడవారు అని కూడా చూడకుండా వారిపై అసభ్యమైన కామెంట్స్ చేయడం, వారి వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ పరిణామాలపై బిగ్ బాస్ 2 ఫైనలిస్ట్ సామ్రాట్ స్పందించారు. కౌశల్ ఆర్మీ ట్రోలింగ్ వల్ల అందరూ ఇబ్బందులు పడుతున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
ఇక్కడ దారుణం... అక్కడ స్వర్గం: శ్రీరెడ్డి జీవితంలో సడెన్ టర్న్, ఈ ఫోటోలే సాక్ష్యం!
హైదరాబాద్లో శ్రీరెడ్డి విషయంలో జరిగిన కొన్సి సంఘటనలు చూసి ఇక ఆమె సినిమా కెరీర్ ముగిసినట్లే అని అంతా భావించారు. అయితే ఎవరూ ఊహించని విధంగా చెన్నైకి షిప్ట్ అవ్వడంతో శ్రీరెడ్డి జీవితం ఊహించని మలుపు తిరిగింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
యాంకర్ ప్రదీప్ ‘పెళ్లిచూపులు'షోకు అమ్మాయిల ఎంపిక వెనక సంచలన విషయాలు!
మాటీవీలో 'పెళ్లి చూపులు' పేరుతో కొత్త రియాల్టీ షో ప్రారంభమైన సంగతి తెలిసిందే. యాంకర్ సుమ ఈ షోను హోస్ట్ చేస్తున్నారు. ఈ షో ద్వారా ప్రదీప్ తనకు కాబోయే జీవిత భాగస్వామిని ఎంచుకుంటారు. గత ఆదివారం నుండే ఈ షో ప్రారంభం అయింది. ఈ షో కోసం కొన్ని వందల మంది అమ్మాయిలు అప్పై చేసుకోగా చివరకు 14 మంది సెలక్ట్ అయ్యారు. అయితే ఈ షోకు సెలక్ట్ అయి పలు కారణాల వల్ల వెళ్లలేక పోయిన లుబ్నా వాలియా అనే అమ్మాయి.... ఈ షో ఎంపిక వెనక రహస్యాలను బయట పెట్టింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
అక్కినేని ఫ్యామిలీ వెకేషన్: ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ సంబరాల్లో చైతూ-సామ్ (ఫోటోస్)
నాగ చైతన్య, సమంత వివాహం జరిగి ఈ అక్టోబర్ 6తో సరిగ్గా సంవత్సరం పూర్తవుతుంది. ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సీని రోటీన్గా కాకుండా డిఫరెంటుగా ప్లాన్ చేసుకున్నారు టాలీవుడ్ కపుల్. అక్కినేని ఫ్యామిలీతో పాటు వారికి సన్నిహితులతో విదేశాల్లో వెకేషన్ ప్లాన్ చేశారు. కొన్ని రోజుల క్రితమే సమంత, నాగ చైతన్య కలిసి స్పెయిన్ దేశంలోని ఇబిజా ఐలాండ్ వెళ్లిన సంగతి తెలిసిందే. దేవదాస్ ప్రమోషన్స్ పూర్తి చేసుకుని నాగార్జున కూడా తన భార్య అమల, మరికొందరు ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కలిసి స్పెయిన్ ఫ్లైట్ ఎక్కేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సమంత, నాగార్జున అభిమానులతో పంచుకున్నారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
తండ్రి చితికి నిప్పు పెట్టలే.. బతికి ఉంటే విలువ తెలియలే, నాన్నకు మాట చెప్పలే.. భోరున ఏడ్చిన ఎన్టీఆర్
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ వస్తున్న అరవింద సమేత.. వీర రాఘవ చిత్రం అక్టోబర్ 11న రిలీజ్కు సిద్దమైంది.తన తండ్రి హరికృష్ణను, త్రివిక్రమ్తో రిలేషన్ చెబుతూ కన్నీటి పర్యంతమయ్యారు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎన్టీఆర్ ఉద్వేగంగా మాట్లాడిన మాటలు ...
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
ఎప్పటికీ పవన్ నా దేవుడే.. ప్రతీసారి కోసుకొని చెప్పాలా? ఆ హీరోకు మోసం చేయలేదు.. బండ్ల గణేష్
నిర్మాత బండ్ల గణేష్ ఏ మాట్లాడినా.. కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడుతాడు. ఎదుట ఎవరున్నారనే విషయాన్ని అసలే పట్టించకోడు. బండ్ల గణేష్ తన ఆరాధ్యదైవం పవన్ కల్యాణ్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
అందుకే పిల్లల్ని కనలేదు.. నా మరణం తర్వాత.. విజయశాంతి, చిరంజీవి, పవన్పై సీరియస్ కామెంట్
సినీ రంగంలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్నప్పుడే లేడీ అమితాబ్ విజయశాంతి రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆ తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించారు. 2014లో ఓటమి తర్వాత సినీ, రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ప్రస్తుత రాజకీయాలపై, సినిమాలోని పరిస్థితుల గురించి మాట్లాడారు. తన వ్యక్తిగత, సినీ, రాజకీయ విషయాలపై ఆమె స్పందించారు. ఆమే ఏమన్నారంటే..
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
నన్నుతొక్కాలని చూస్తే ఊరుకొను.. కాంగ్రెస్ వాళ్లనే అడగండి.. ఆ భయం ఉంది.. విజయ్ దేవరకొండ
వరుస సినిమాలు, విజయాలతో దూసుకెళ్తున్నాడు విజయ దేవరకొండ. అర్జున్ రెడ్డి, మహానటి, గీత గోవిందం చిత్రాల తర్వాత నోటా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. తెలంగాణాలో ఎన్నికలు ఉన్నందున నోటా సినిమాను నిలిపివేయాలని రాజకీయ పార్టీలు కోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్లో విజయ్ దేవరకొండ తెలుగు ఫిల్మీబీట్తో ముచ్చటించారు. విజయ్ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే..
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
నాకు ఏ ముఖ్యమంత్రి ఇష్టమంటే.. ఆ పార్టీలకు నోటా అంటే భయం.. విజయ్ దేవరకొండ
అర్జున్ రెడ్డి, గీత గోవిందం చిత్రాలకు తెలుగుకే పరిమితమైన విజయ్ దేవరకొండ ప్రస్తుతం దక్షిణాదికి విస్తరించాడు. నోటా చిత్రం కేరళ, తమిళ, కన్నడ, తెలుగు భాషల్లో విడుదలవుతున్నది. తెలంగాణాలో ఎన్నికలు ఉన్నందున నోటా సినిమాను నిలిపివేయాలని రాజకీయ పార్టీలు కోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. ఈ నేపథ్యంలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు..
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
బిగ్ బాస్ అసలు విజేతలు వీళ్ళే , కౌశల్ కాదు.. దుమారం రేపుతున్న తేజస్వి!
నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ 2 ముగిసింది. కౌశల్ విజేతగా నిలిచాడు. కౌశల్ ఆర్మీ అండతో, తన ఒంటరి పోరాటంతో అనుకున్న లక్ష్యం సాధించాడు. కానీ హౌస్ సభ్యులలో మాత్రం కౌశల్ ఎక్కువమందికి శత్రువుగానే మిగిలిపోయాడు. బిగ్ బాస్ 2 సీజన్ మొత్తం గమనిస్తే కౌశల్ కు ఇతర ఇంటి సభ్యులకు మధ్య వాదోపవాదాలు ఎక్కువగా జరిగాయి. ఒకరకంగా చెప్పాలంటే కౌశల్ తో గొడవ ప్రారంభించిన మొదటి ఇంటి సభ్యురాలు తేజస్వి అని చెప్పొచ్చు. తేజస్వి ఉన్నన్ని రోజులు వీరిద్దరి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేంతగా వివాదాలు చోటు చేసుకున్నాయి. తాజగా తేజస్వి సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వివాదంగా మారింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
నేను, అమిత్ ఇద్దరమే.. కౌశల్ సతీమణి ఎదుర్కొన్న ఇబ్బందులు, డబ్బులిస్తే ఓట్లేస్తారు కానీ!నేను, అమిత్ ఇద్దరమే.. కౌశల్ సతీమణి ఎదుర్కొన్న ఇబ్బందులు, డబ్బులిస్తే ఓట్లేస్తారు కానీ!
బిగ్ బాస్ విన్నర్ కౌశల్ ప్రస్తుతం టాలీవుడ్ లో సెన్సేషన్ గా మారిపోయారు. కౌశల్ గురించే ప్రస్తుతం హాట్ హాట్ గా చర్చ జరుగుతోంది. బిగ్ బాస్ సీజన్ మొత్తం కౌశల్ కేంద్రంగానే జరిగిందని చెప్పొచ్చు. హౌస్ లో దాదాపుగా ప్రతి రోజు కౌశల్ గురించి చర్చ జరిగేది. ఆదివారం జరిగిన గ్రాండ్ ఫినాలేలో గీత మాధురిపై విజయం సాధించిన కౌశల్ బిగ్ బాస్ టైటిల్ ని ఎగరేసుకుపోయాడు. ప్రస్తుతం కౌశల్ ఇంటర్వ్యూలతో బిజీగా గడుపుతున్నాడు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
సీనియర్ నటుడిపై విరుచుకుపడ్డ శ్రీరెడ్డి.. నీ బండారం బయటపెడుతా!
వివాదాస్పద వ్యాఖ్యలతో తరచుగా శ్రీరెడ్డి హాట్ టాపిక్ గా మారుతోంది. టాలీవుడ్ ప్రముఖులపై శ్రీరెడ్డి విమర్శల దాడి కొనసాగుతూనే ఉంది. కాస్టింగ్ కౌచ్ పేరుతో మీడియా ఛానల్స్ లో హల్ చల్ చేసిన శ్రీరెడ్డి ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వివాదాలు సృష్టిస్తోంది. తాజగా శ్రీరెడ్డి టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. సడెన్ గా రాజేంద్ర ప్రసాద్ పై శ్రీరెడ్డి విమర్శలు మొదలు పెట్టడం గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
రాంచరణ్ అంటే ఇది.. సిబ్బంది కోసం, ఇలాంటి పని ఎంతమంది చేస్తారు!
మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం బోయపాటి దర్శత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ కానీ, ఫస్ట్ లుక్ కానీ విడుదల చేయకపోవడంతో ఫ్యాన్స్ కాస్త నిరాశలో ఉన్నారు. ఇదిలా ఉండగా ఇటీవల రాంచరణ్ తన అజార్బైజాన్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. జార్జియాలో షూటింగ్ జరుపుకుంటున్న మెగాస్టార్ సైరా నిర్మాణపనులు చూసుకుంటూ బిజీగా ఉన్నాడు. ఈ చిత్రానికి పనిచేస్తున్న సిబ్బంది విషయంలో రాంచరణ్ చేసిన పనికి అభినందనలు దక్కుతున్నాయి.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
ఎన్టీఆర్ పక్కాగా 100 కోట్లు కొట్టాలి, లేకుంటే.. షాక్ ఇస్తున్న ప్రీ రిలీజ్ బిజినెస్!
యంగ్ టైగర్ ఎన్టీఆర్. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న తొలి చిత్రం అరవింద సమేత వీర రాఘవ. అరవిందగా పూజ హెగ్డే, వీర రాఘవగా ఎన్టీఆర్ నటిస్తున్నారు. క్రేజీ కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ చిత్రంపై ఏస్థాయిలో అంచనాలు ఉన్నాయో అందరికి తెలిసిందే. చిత్ర విడుదలకు వారం రోజుల ముందు నుంచే హంగామా మొదలైపోయింది. తాజాగా అరవింద సమేత చిత్రానికి జరుగుతున్న ప్రీ రిలీజ్ బిజినెస్ గురించి ఆసక్తికర వార్తలు వస్తున్నాయి.